ఆర్ఎస్ఎస్ చీఫ్ తో సినీ తార‌ల భేటీ

Spread the love

ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్స‌వం

ముంబై : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 100వ వార్షికోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది మ‌రాఠా లోని ముంబై న‌గ‌రంలో. దేశానికి చెందిన వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు , సినీ తార‌లు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ ను క‌లిసేందుకు బారులు తీరారు. ఆయ‌న‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యేందుకు పోటీ ప‌డ్డారు. ఇందులో సినీ న‌టులు ఉన్నారు. రూపా గంగోలీతో పాటు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి కూడా మోహ‌న్ భ‌గ‌వ‌త్ తో చ‌ర్చించారు.

ఈ సంద‌ర్బంగా ఈ ఇద్ద‌రు న‌టులు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భారత దేశాన్ని ప్ర‌భావితం చేస్తున్న వ్య‌క్తుల‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ ఒక‌రు అని పేర్కొన్నారు. ఈ కీల‌క స‌మ‌యంలో త‌న‌తో భేటీ కావ‌డం మ‌రింత ఆనందంగా ఉంద‌న్నారు రూపా గంగూలీ, శిల్పా శెట్టి. ఆర్ఎస్ఎస్ వంద‌వ వార్షికోత్స‌వ వేడుక‌ల‌లో భాగం కావ‌డం తాము జీవితంలో మ‌రిచి పోలేమ‌ని అన్నారు. ఈ చారిత్రాత్మ‌క సంద‌ర్బంలో భాగ‌మైనందుకు సంతోషంగా ఉంద‌న్నారు.

  • Related Posts

    జ‌న నాయ‌కుడితో జ‌న నాయ‌గ‌న్

    Spread the love

    Spread the loveచెన్నై వెడ్డింగ్ లో క‌లుసుకున్న నేత‌లు చెన్నై : చెన్నై వేదిక‌గా జ‌రిగిన వివాహ వేడుక‌లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, టీవీకే పార్టీ చీఫ్ ,…

    విజ‌య్ కార్తీక్ తో విడి పోతున్నా : కీర్తి భ‌ట్

    Spread the love

    Spread the loveసోష‌ల్ మీడియా వేదిక‌గా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న హైద‌రాబాద్ : ఈ మ‌ధ్య విడాకుల ప్ర‌క‌ట‌న‌లు ఎక్కువై పోయాయి. ఇక సినీ రంగంలో ఎవ‌రు ఎప్పుడు క‌లిసి ఉంటారో ఎప్పుడు విడి పోతారో తెలియ‌ని ప‌రిస్థితి. ఇందుకు అసాధార‌ణ ప‌రిస్థితులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *