న‌మీబియాతో ఆడ‌నున్న సంజూ శాంస‌న్ ..?

Spread the love

క‌డుపు నొప్పితో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ దూరం

న్యూఢిల్లీ : భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా న్యూఢిల్లీలో జ‌ర‌గ‌నుంది రెండో మ్యాచ్. ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆడ‌డం లేదు. త‌ను గ‌త కొన్ని రోజులుగా తీవ్ర‌మైన క‌డుపు నొప్పితో బాధ ప‌డుతున్నాడు. దీంతో టీం మేనేజ్మెంట్, హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఎవ‌రిని ఓపెన‌ర్ గా తీసుకోవాల‌నే దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. అయితే స్వ‌దేశంలో న్యూజిలాండ్ తో జ‌రిగిన టి20 సీరీస్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన కేర‌ళ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ తీవ్ర నిరాశ ప‌రిచాడు. త‌ను కేవ‌లం 50 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. దీంతో అనూహ్యంగా తెర‌పైకి ఇషాన్ కిష‌న్ వ‌చ్చాడు. త‌ను ప్ర‌స్తుతం టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఓపెనింగ్ చేస్తున్నాడు.

ఈ త‌రుణంలో ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని గంభీర్ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక స‌కాలంలో కోలుకుంటే అభిషేక్ శ‌ర్మ‌ను ఆడిస్తామ‌ని లేక పోతే సంజూ శాంస‌న్ కు ఛాన్స్ ఇవ్వ‌నున్న‌ట్లు సూత్ర ప్రాయంగా వెల్ల‌డించాడు బ్యాటింగ్ కోచ్. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ మైదానంలో సంజూ శాంస‌న్ , ఇషాన్ కిష‌న్ తో క‌లిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. నమీబియాతో జరిగే మ్యాచ్ కు ముందు అభిషేక్ శ‌ర్మ‌కు జ్వరం లక్షణాలు తగ్గకపోతే, పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు అతను పూర్తిగా ఫిట్ గా ఉండేలా టీం ఇండియా త‌న‌ స్థానంలో సంజు సామ్సన్ ను తీసుకోవచ్చు.

  • Related Posts

    డిఫెండింగ్ ఛాంపియ‌న్ సూప‌ర్ షో

    Spread the love

    Spread the loveమ‌రోసారి స‌త్తా చాటిన విరాట్ కోహ్లీ బెంగ‌ళూరు : ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు దుమ్ము రేపుతోంది. వ‌రుస విజ‌యాలతో స‌త్తా చాటుతోంది. ర‌జిత్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని ఈ జ‌ట్టు ఊహించ‌ని విధంగా గెలుస్తూ…

    క్రీడా రంగంలో ఏపీని టాప్ లో నిలుపుతాం

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి నారా లోకేష్ తిరుప‌తి జిల్లా : ఏపీని క్రీడా రంగంలో టాప్ లో నిలిపేందుకు కృషి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. బుధ‌వారం తిరుపతిలోని శ్రీ శ్రీనివాస…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *