ప్ర‌ధాని మోదీ ఆలోచ‌నా విధానం అద్బుతం

ప్ర‌శంస‌లు కురిపించిన క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా

న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ప్ర‌ముఖ క్రికెట‌ర్ రవీంద్ర జ‌డేజా. త‌న స‌తీమ‌ణి , మంత్రి రివాబా జ‌డేజాతో క‌లిసి పీఎం నివాసంలో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా ప‌లు అంశాల‌పై వీరు చ‌ర్చించారు. ప్ర‌ధాని తో క‌లిసిన అనంత‌రం ర‌వీంద్ర జ‌డేజా, రివాబా జ‌డేజా మీడియాతో మాట్లాడారు న్యూఢిల్లీలో. ప్రధాని మోదీతో సంభాషించే అవకాశం లభించడం గొప్ప అదృష్టం, గౌరవం అన్నారు. ఆయ‌న‌తో క‌లిసిన ప్ర‌తీసారి ఏదో ఒక కొత్త అంశం త‌మ ముందుకు వ‌స్తుంద‌న్నారు ర‌వీంద్ర జ‌డేజా.

ప్ర‌ధానంగా దేశ ప్ర‌ధాన‌మంత్రి విధి నిర్వ‌హ‌ణ‌లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ తాము అడిగిన వెంట‌నే క‌లిసేందుకు అవ‌కాశం ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు స్టార్ క్రికెట‌ర్. ప్ర‌త్యేకించి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ఆలోచ‌నా విధానం, ఉత్సాహం, అంకిత భావం కోట్లాది మందికి స్పూర్తిని క‌లిగిస్తూనే ఉంటుంద‌న్నారు ర‌వీంద్ర జ‌డేజా. ఆయ‌న లాంటి వ్య‌క్తిని తాము ఇంత వ‌ర‌కు చూడ‌లేద‌న్నారు. అందుకే ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన‌, స‌మ‌ర్థ‌వంతుడైన నాయ‌కుడిగా గుర్తింపు పొందుతున్నాడ‌ని పేర్కొన్నారు ర‌వీంద్ర జ‌డేజా. ఇదిలా ఉండ‌గా ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులో ఏ గ్రేడ్ లో జడేజా ఉండగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బీ గ్రేడ్ లకు పడిపోవడం సంచలనంగా మారింది.

  • Related Posts

    తమిళనాడు క్రీడా మౌలిక సదుపాయాల సమూల ప్రక్షాళన

    చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలోని 38 జిల్లాల్లో ఆధునిక క్రీడా వసతి గృహాలు (హాస్టల్స్), మెరుగైన స్టేడియంలు , ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలతో సహా క్రీడా మౌలిక సదుపాయాలను సమూలంగా ఆధునీకరించనున్నట్లు మంత్రి ఆధవ్ అర్జున ప్రకటించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ…

    తెలంగాణ‌లో రూ. 30 కోట్ల‌తో క్రీడా స‌దుపాయాల క‌ల్ప‌న

    హైద‌రాబాద్ : తెలంగాణ‌కు ఖేలో ఇండియా యూత్ పోటీల నిర్వ‌హ‌ణ‌ను కేటాయించ‌డం ప‌ట్ల పీఎం మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాల‌ కల్పన జరిగిందన్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *