ప్ర‌ధాని మోదీ ఆలోచ‌నా విధానం అద్బుతం

ప్ర‌శంస‌లు కురిపించిన క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా

న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ప్ర‌ముఖ క్రికెట‌ర్ రవీంద్ర జ‌డేజా. త‌న స‌తీమ‌ణి , మంత్రి రివాబా జ‌డేజాతో క‌లిసి పీఎం నివాసంలో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా ప‌లు అంశాల‌పై వీరు చ‌ర్చించారు. ప్ర‌ధాని తో క‌లిసిన అనంత‌రం ర‌వీంద్ర జ‌డేజా, రివాబా జ‌డేజా మీడియాతో మాట్లాడారు న్యూఢిల్లీలో. ప్రధాని మోదీతో సంభాషించే అవకాశం లభించడం గొప్ప అదృష్టం, గౌరవం అన్నారు. ఆయ‌న‌తో క‌లిసిన ప్ర‌తీసారి ఏదో ఒక కొత్త అంశం త‌మ ముందుకు వ‌స్తుంద‌న్నారు ర‌వీంద్ర జ‌డేజా.

ప్ర‌ధానంగా దేశ ప్ర‌ధాన‌మంత్రి విధి నిర్వ‌హ‌ణ‌లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ తాము అడిగిన వెంట‌నే క‌లిసేందుకు అవ‌కాశం ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు స్టార్ క్రికెట‌ర్. ప్ర‌త్యేకించి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ఆలోచ‌నా విధానం, ఉత్సాహం, అంకిత భావం కోట్లాది మందికి స్పూర్తిని క‌లిగిస్తూనే ఉంటుంద‌న్నారు ర‌వీంద్ర జ‌డేజా. ఆయ‌న లాంటి వ్య‌క్తిని తాము ఇంత వ‌ర‌కు చూడ‌లేద‌న్నారు. అందుకే ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన‌, స‌మ‌ర్థ‌వంతుడైన నాయ‌కుడిగా గుర్తింపు పొందుతున్నాడ‌ని పేర్కొన్నారు ర‌వీంద్ర జ‌డేజా. ఇదిలా ఉండ‌గా ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులో ఏ గ్రేడ్ లో జడేజా ఉండగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బీ గ్రేడ్ లకు పడిపోవడం సంచలనంగా మారింది.

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

    చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *