యూట‌ర్న్ తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

ఫిబ్ర‌వ‌రి 15న టీమిండియాతో ఆడేందుకు రెడీ

హైద‌రాబాద్ : క్రికెట్ అభిమానుల‌కు తీపి క‌బురు అందింది. భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇప్ప‌టి వ‌ర‌కు తాము టీమిండియాతో ఆడేది లేదంటూ ప్ర‌క‌టించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ ప్ర‌దాని షెహ‌బాజ్ ష‌రీఫ్ సైతం అనుమ‌తి ఇచ్చేది లేదంటూ ప్ర‌క‌టించారు. ఈ త‌రుణంలో అస‌లు మ్యాచ్ లు జ‌రుగుతాయా లేదా అన్న అనుమానం నెల‌కొంది. మ‌రో వైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇండియాతో ఆడ‌బోమంటూ ప్ర‌క‌టించింది. ఇండియాలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగే ఛాన్స్ ఉందంటూ ఆరోపించింది. దీంతో ఐసీసీ సీరియ‌స్ గా వార్నింగ్ ఇచ్చింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ బోర్డుల‌కు భ‌విష్య‌త్తులో ఆడేందుకు ఛాన్స్ ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా ఐసీసీ నుంచి తీవ్ర ఒత్తిడి రావ‌డంతో పాటు స్పాన్స‌ర్ చేస్తున్న కంపెనీలు సైతం సీరియ‌స్ గా వార్నింగ్ ఇచ్చాయి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు. చివ‌ర‌కు ఒత్తిడిని త‌ట్టుకోలేక పాకిస్తాన్ పీఎం ష‌రీఫ్ దిగి వ‌చ్చారు. ఒకానొక ద‌శ‌లో అమెరికా సైతం జోక్యం చేసుకున్న‌ట్లు పెద్ద ఎత్తున టాక్ న‌డుస్తోంది. ఇది ప‌క్క‌న పెడితే మంగ‌ళ‌వారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు పీసీబీ చీఫ్ మోహిషిన్ న‌ఖ్వీ. తాము భార‌త్ తో ఆడేందుకు సిద్దంగా ఉన్నామంటూ ప్ర‌క‌టించాడు. ఇదిలా ఉండ‌గా శ్రీ‌లంక దేశ రాజ‌ధాని కొలంబో వేదిక‌గా దాయాదులైన పాకిస్తాన్, ఇండియా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

    చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *