నెత‌న్యాహూతో ప్ర‌ధాన‌మంత్రి మోదీ భేటీ

కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన దేశాధినేత‌లు

ఇజ్రాయెల్ : ఇజ్రాయెల్ లో ప‌ర్య‌టిస్తున్నారు భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా ఇజ్రాయెల్ దేశ ప్ర‌ధాన మంత్రి బెంజిమ‌న్ నెత‌న్యూహూతో భేటీ అయ్యారు. ఈ ఇరువురు దేశాధినేత‌లు రెండు గంట‌ల‌కు పైగా స‌మావేశం అయ్యారు. ఈ ఇద్ద‌రి భేటీ పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. నెత‌న్యాహూతో జ‌రిగిన సంభాష‌ణ‌లు ఫ‌ల‌ప్ర‌దం అవుతాయ‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఆయ‌న స్వంత సామాజిక వేదిక ఎక్స్ ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

ముందుగా త‌న‌కు లభించిన ఆత్మీయ స్వాగతం కోసం కృతజ్ఞతలు తెలియజేస్తున్న‌ట్లు తెలిపారు. 9 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్‌కు తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు ప్ర‌ధాన‌మంత్రి మోదీ. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో విస్తృత శ్రేణి అంశాలపై తాము చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. సాంకేతికత, నీటి నిర్వహణ, వ్యవసాయం, ప్రతిభ భాగస్వామ్యం వంటి రంగాలు సన్నిహిత సహకారానికి అపారమైన అవకాశాలను అందిస్తున్నాయని తెలిపారు మోదీ. ఈ ప్రాంతంలోని కీలక పరిణామాలను కూడా చ‌ర్చింన‌ట్లు వెల్ల‌డించారు. ఇరు దేశాలు బ‌ల‌మైన బంధాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకునే దిశ‌గా అడుగులు వేసిన‌ట్లు తెలిపారు మోదీ.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *