మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ఖుష్ క‌బ‌ర్

Spread the love

రూ. 1000 కోట్ల విలువైన రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ ఇస్తాం

హైద‌రాబాద్ : రాజేంద్ర న‌గ‌ర్ ఎమ్మెల్యే వ‌న్నాడ ప్ర‌కాశ్ గౌడ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌ధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. అక్కడ నష్టపోతున్న వారందరికీ రూ. 1000 కోట్ల విలువైన రెడీ టు ఆక్యుపై గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ ఇస్తామ‌ని చెప్పారు. గురువారం ఆయ‌న బాధితుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు . తాను మీకు అండ‌గా ఉంటాన‌ని స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేశారు.

మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా 5000 కోట్లతో నిర్మించబోయే గాంధీ విగ్రహం కోసం భూ సేకరణ చేస్తున్నారు. ఇందులో భాగంగా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ 450 ఫ్లాట్స్ వాసులకు తీర‌ని న‌ష్టం జ‌రుగుతుంది. దీంతో బాధితుల ఆందోళ‌న‌ను , ఆవేద‌న‌ను అర్థం చేసుకున్నారు ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్. న్యాయం జరిగేలా అదే విస్తీర్ణంలో (Same SFT) వేరే సురక్షితమైన గెటెడ్ కమ్యూనిటీలో ‘Ready to Occupy’ ఫ్లాట్లను కేటాయించడం జరుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. లేదా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం తగిన నష్టపరిహారం చెల్లిస్తామ‌న్నారు.

కాగా ఇదే తరహాలో నష్టపోతున్న కిస్మత్ పూర్, ఇతర మూసీ ప్రాంతాలు, ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు ఇలాగే నష్ట పరిహారం చెల్లిస్తారా లేదా అన్న‌ది ఇంకా తేలాల్సి ఉంది.

  • Related Posts

    పోలవరం-నల్లమల సాగర్ లింకు రాష్ట్రాలకూ లాభమే

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం శాస‌న స‌భలో ప‌లువురు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూల్ గా స‌మాధానం ఇచ్చారు.…

    7న మిట్ట‌ల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాప‌న‌

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి కొల్లు ర‌వీంద్ర అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి వ‌ల్ల రాష్ట్రంలో అతి పెద్ద ఉక్కు ఆధారిత ప‌రిశ్ర‌మ రాబోతోంద‌ని , ఇందుకు త్వ‌ర‌గా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *