క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

బాధిత కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని భరోసా

అమ‌రావ‌తి : కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటన క్షతగాత్రులను పరామర్శించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. కాలిన గాయాలతో ఉన్న బాధితులను చూసి చలించి పోయారు. ⁠విస్ఫోటన ఘటనకుగల కారణాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధికారులు, వైద్య సిబ్బందిని అడిగి మృతులు, క్షతగాత్రుల వివరాలు ఆరా తీశారు పవన్ కళ్యాణ్ .ఆసుపత్రిలో క్షతగాత్రులకు అందుతున్న వైద్య సదుపాయాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు మృతి చెంద‌డం ప‌ట్ల తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మ‌రో వైపు రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌, పుర‌పాల‌క శాఖ మంత్రి నారాయ‌ణ‌, ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్న‌తాధికారులు సైతం బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఇదిలా ఉండ‌గా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా యంత్రాంగం, వైద్య సిబ్బందిని ఆదేశించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *