గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ గా రాయ‌ల‌సీమ‌

ప్ర‌క‌టించిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో 6 లక్షల హెక్టార్లను కొత్తగా ఉద్యాన పంటల కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం 2026-27లో రూ.200 కోట్లు కేటాయించామని వెల్లడించారు. కొబ్బరి ప్రాసెసింగ్ పార్క్‌ను అమలాపురంలో ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. 2025-26లో 20.01% OERతో మెట్రిక్ టన్నుకు రూ.20,680 ధర రైతులకు లభించిందన్నారు.

2026-27లో 35,000 హెక్టార్ల కొత్త విస్తరణ లక్ష్యంతో రూ.204 కోట్లు ప్రతిపాదించామని తెలిపారు అచ్చెన్నాయుడు. ఉద్యానశాఖకు 2026-27 సంవత్సరానికి రూ.1,123.86 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించామ‌న్నారు. రైతుల ఆదాయం పెంపుతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఉద్యాన రంగాన్ని శక్తివంతం చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 2024-25లో 1.18 లక్షల హెక్టార్లు, 2025-26లో ఇప్పటివరకు 1.05 లక్షల హెక్టార్లలో డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలు అందించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామని తెలిపారు. 2026-27లో 1.50 లక్షల హెక్టార్ల లక్ష్యంతో పాటు రూ.475 కోట్లతో సూక్ష్మసేద్యానికి చర్యలు చేపట్టామని వెల్లడించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *