వ‌డగాల్పుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి : ఎండా కాలం ప్రారంభ‌మైంద‌ని, అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాల్పుల తీవ్రతపై ఏపిఎస్డీఎంఏ (APSDMA) కార్యాలయంలో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026’ ను ఆవిష్కరించారు. ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాల‌న్నారు.

అంతే కాకుండా ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు వంగ‌ల‌పూడి అనిత‌. ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు, మందులు సిద్ధం చేయడంతో పాటు నిరంతర తాగునీటి సరఫరా, చలి వేంద్రాలను ఏర్పాటు చేయాల‌న్నారు. పశువుల రక్షణ, కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు వంగ‌ల‌పూడి అనిత‌. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం తీసుకునే సూచనలను పాటించాలని కోరారు.

  • Related Posts

    ఆక్వా రైతులు ఆందోళ‌న చెందొద్దు

    Spread the love

    Spread the loveభ‌రోసా ఇచ్చిన ఏపీ కూట‌మి స‌ర్కార్ అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌స్తుతం గ‌ల్ఫ్ దేశాల‌లో యుద్ద వాతావ‌ర‌ణం నెల‌కొన్న త‌రుణంలో రాష్ట్రానికి చెందిన ఆక్వా రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం…

    తెలంగాణ ప‌ట్ల కేంద్రం వివ‌క్ష త‌గ‌దు

    Spread the love

    Spread the loveభ‌గ్గుమ‌న్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రం ప‌ట్ల కేంద్రం స‌వ‌తిత‌ల్లి ప్రేమ క‌న‌బ‌రుస్తోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. గ‌త 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *