హెచ్చరించిన మంత్రి దామోదర రాజనరసింహ
హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా
ఉమెన్ వెల్నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ చేపట్టిందని అన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ . ఎక్కడైనా చిన్నపాటి లోపాలు తలెత్తితే, వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని విభాగాల మధ్య పక్కా సమన్వయం ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం మహిళల ఆరోగ్యం కోసం ఈ ప్రణాళికను రూపొందించిందన్నారు. నాన్-కమ్యూనికబుల్ వ్యాధులను ముందుగానే గుర్తించి, మెరుగైన వైద్యం అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లోని 542 మండలాల పరిధిలో ఉన్న సుమారు 46 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఒక్కో మహిళకు రక్తహీనత (అనీమియా), మధుమేహం, బీపీ, థైరాయిడ్, కాలేయం, కిడ్నీ పనితీరు తదితర 30 రకాల (జనరల్ మరియు ల్యాబ్) ఆరోగ్య పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు. తొలి దశలో ప్రతి జిల్లాలోని 5 మండలాల్లో ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారని అన్నారు. మౌలిక వసతులు, సిబ్బంది లభ్యత ఆధారంగా రెండో దశలో మిగిలిన అన్ని మండలాలకు దీనిని విస్తరిస్తారని చెప్పారు మంత్రి.





