మరో ఆరుగురు డ్రగ్స్ వాడినట్లు తేలిందన్న ఎస్పీ
హైదరాబాద్ : తెలంగాణలో కాల్పుల కలకలం సంచలనం రేపింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఈగిల్ టీం దాడి చేసింది. ఈ సమయంలో పలువురు పొలిటికల్ లీడర్లు ఇందులో డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. దీంతో సిబ్బందిపై రోహిత్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీ కాల్పులకు తెగబడినట్లు సమాచారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రస్తుత ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో పాటు రోహిత్ రెడ్డి కూడా డ్రగ్స్ సేవించినట్లు తేలడం విస్తు పోయేలా చేసింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ఈగిల్ టీం ఎస్పీ గిరిధర్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పోలీసులు జరిపిన దాడిలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురు డ్రగ్స్ వాడినట్లు తేలిందన్నారు. ఒక నిర్దిష్ట ఫామ్హౌస్పై దాడి చేసి, ఒక వ్యక్తి ఆయుధాన్ని ఉపయోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. తాము ఫామ్హౌస్లోకి ప్రవేశించినప్పుడు, మా అధికారులు కొన్ని శబ్దాలు విన్నారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పిస్టల్ పట్టుకున్న ఒక వ్యక్తిని పట్టుకున్నారు. మరొక వ్యక్తి వద్ద కొన్ని ఖాళీ రౌండ్లు కూడా ఉన్నాయి. అధికారులు 11 మందిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వారికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా, వారిలో 5 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు ఎస్పీ. తాము అన్ని విధానపరమైన కార్యకలాపాలను నిర్వహించామన్నారు వారిని రక్త నమూనా పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.. 5 మందితో పాటు ఒక వ్యక్తికి పాజిటివ్ అని తేలిందన్నారు. కాబట్టి, మొత్తం 6 మందికి పాజిటివ్ వచ్చిందని రూఢీ చేసుకున్నామన్నారు. ఇందులో ఒక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే అని, మరొకరు సిట్టింగ్ ఎంపీ కూడా ఉన్నారని సంచలన ప్రకటన చేశారు.





