స్వేచ్ఛ కుటుంబానికి జేసీహెచ్ఎస్ఎల్ ఆస‌రా

Spread the love

రూ. 50,000 ఆర్థిక సాయం అంద‌జేసిన ప్రెసిడెంట్

హైద‌రాబాద్ : ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ త‌న ఉదార‌త‌ను చాటుకుంది. గత సంవత్సరం జూన్ నెలలో మరణించిన ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు “స్వేచ్ఛ” కుటుంబానికి మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. గతంలో ఆమె కుటుంబ సభ్యులకు రూ.50,000 అందజేసిన మేనేజింగ్ కమిటీ సభ్యులు, నిన్న “స్వేచ్ఛ” కుమార్తె చదువు, కుటుంబ అవసరాల కోసం మరో రూ.50,000లను “స్వేచ్ఛ” తండ్రి శంకరన్నకు అందజేశారు.

ఇదిలా ఉండ‌గా ఈ మొత్తం మేనేజింగ్ కమిటీ సభ్యుల వ్యక్తిగత కాంట్రిబ్యూషన్ ద్వారా సమకూర్చబడింది. )
ఈ సందర్భంగా “స్వేచ్ఛ” కుటుంబానికి మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని శంకరన్నకు హామీ ఇచ్చారు సంస్థ ప్రెసిడెంట్ బ్ర‌హ్మాండ‌గిరి గోపరాజు. త‌న జీవిత‌మంతా ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసిన గొప్ప జ‌ర్న‌లిస్టు స్వేచ్ఛ అని పేర్కొన్నారు. ఆమె మ‌న మ‌ధ్య లేక పోవ‌డం బాధగా ఉంద‌న్నారు. భ‌విష్య‌త్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నామ‌ని భ‌రోసా కల్పించారు.

  • Related Posts

    అక్ష‌య పాత్ర అరుదైన రికార్డ్

    Spread the love

    Spread the love5 బిలియ‌న్ భోజ‌నాల మైలు రాయి న్యూఢిల్లీ : ఇస్కాన్ కు చెందిన అక్ష‌య పాత్ర అరుదైన రికార్డు సాధించింది. సంస్థ ప్రారంభించి నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంతే కాదు ఏకంగా 5 బిలియ‌న్ భోజ‌నాల‌ను…

    గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప చేసిందేమీ లేదు

    Spread the love

    Spread the loveమాజీ ఎమ్మెల్యే వెంక‌ట్రామిరెడ్డిపై స‌విత సెటైర్ శ్రీ స‌త్య‌సాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు. శ్రీ స‌త్య‌సాయి జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెంక‌ట్రామిరెడ్డిపై సెటైర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *