టీడీపీ హ‌యాంలోనే బీసీల‌కు ప్రాధాన్య‌త

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి ఎస్. స‌విత‌

అమ‌రావ‌తి : బీసీలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వాలవేనన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. బీసీ రక్షణ చట్టం తుది ముసాయిదా సిద్ధమైందని, త్వరలోనే ఈ చట్టాన్ని అమలు చేయనున్నామని వెల్ల‌డించారు. సీఎం చంద్రబాబు కేబినెట్ లో ఎనిమిది మంది బీసీ మంత్రులకు కీలక శాఖలు అప్పగించారన్నారు. కేంద్రమంత్రిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కింజరాపు రామ్మోహననాయుడికి అవకాశమిచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో బీసీలకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు.

వడ్డెర్ల సామాజిక వర్గీయులకు అన్నివిధాలా సీఎం చంద్రబాబు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. వడ్డెరలకు మైనింగ్ లీజుల్లో 15 శాతం రాయితీ కల్పించామన్నారు. వడ్డెరలకు మైనింగ్ లీజు రిజర్వేషన్లు రద్దు చేసిన ఘనుడు జగన్ అని విమర్శించారు. వడ్డెర్లను ఎస్టీలో చేర్చే విషయమై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. జ‌గ‌న్ పాల‌నా కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం 30 ఏళ్లు అన్ని రంగాల‌లో వెనుక‌బాటుకు గురైంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అందుకే ప్ర‌జ‌లు ఛీ కొట్టార‌ని, త‌న‌కు కోలుకోలేని షాక్ ఇచ్చార‌ని, వైసీపీ పార్టీకి కేవ‌లం 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌ని అన్నారు. అయినా జ‌గ‌న్ రెడ్డికి బుద్ది రావ‌డం లేద‌ని మండిప‌డ్డారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *