newsseals.com
News

వైఎస్ జ‌గ‌న్ కుట్ర‌లు ఇక చెల్ల‌వు : ఎంపీ

VijayaBhaskar March 22, 2026
newssseals-YSJagan
Spread the love

త‌ల్లిని గౌర‌వించ లేని వ్య‌క్తికి అంత సీన్ లేదు

మంగ‌ళ‌గిరి : టీడీపీ ఎంపీ అప్ప‌ల నాయుడు నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న నిర్వాకం కార‌ణంగా ఏపీ రాష్ట్రం అన్ని రంగాల‌లో 30 ఏళ్లు వెన‌క్కి వెళ్లింద‌ని ఆరోపించారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు మంగ‌ళ‌గిరి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో. చరిత్రలో రాక్షసులు కూడా దేవుళ్లను కొలిచిన సందర్భాలు ఉన్నాయి కానీ, జగన్ కు అటు దైవభక్తి లేదు.. ఇటు మాతృభక్తి లేదన్నారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామి ల‌డ్డూను అప‌విత్రం చేయ‌డంలో త‌ను కీల‌క పాత్ర పోషించార‌ని ఆరోపించారు ఎంపీ అప్ప‌ల నాయుడు. గత ఐదేళ్లు హిందూ ధర్మాన్ని నాశనం చేసిన జగన్, ఇప్పుడు స్వామి వారి ప్రసాదం విషయంలో కూడా తన పేటీఎం బ్యాచ్ ద్వారా అబద్ధపు ప్రచారాలు చేయిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వస్తుంటే.. పరిశ్రమలు రాకూడదు, భావితరాలకు ఉపాధి లభించ కూడదు అనే కుట్రతో జగన్ విషప్రచారం చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం బాగుపడినా ఆయనకు నచ్చదన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించండి అని చెప్పడం చాలా చిన్న మాట. కుటుంబ బాధ్యత, సామాజిక స్పృహ లేని ఇలాంటి సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తులను సమాజం నుంచి సంఘ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న జగన్ మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.