పాండిత్యం కంటే మాన‌వ‌త్వం గొప్ప‌ది

గ‌రిక‌పాటి కామెంట్స్ పై మాజీ ఐపీఎస్ ఫైర్

అమ‌రావ‌తి : మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ సునీల్ కుమార్ నిప్పులు చెరిగారు. ప్రముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు తాజాగా చేసిన కామెంట్స్ ప‌ట్ల సీరియ‌స్ అయ్యారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. ఎంత ప్ర‌తిభ‌, పాండిత్యం ఉన్నా వృధా అని అన్నారు. ప‌ది మందికి సాయం చేయ‌ని చేతులు ఉన్నా లేన‌ట్టేన‌ని పేర్కొన్నారు. మానవత్వం లేని పాండిత్యం వృధా అని అన్నారు. గరికపాటి గతంలో దళితుల కు , మహిళలకు జరిగిన అన్యాయాల పట్ల అవగాహన తో మాట్లాడారని గుర్తు చేశారు.

ఇదే స‌మ‌యంలో పెత్తందారీ, పితృస్వామ్య వ్యవస్థ ల తరపున క్షమాపణ కూడా చెప్పారు. అందుకే ఆయన అంటే గౌరవం ఉండేద‌న్నారు పీవీ సునీల్ కుమార్. కానీ పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం మీద ఆయన మాట్లాడిన మాటలు వింటే అసహ్యం వేసింద‌న్నారు. ఎన్ని శాస్త్రాలు చదివినా తన తోటి మనిషి పట్ల , పేద పిల్లల పట్ల సానుభూతి, అవగాహనా లేకపోతే ఆ పాండిత్యం దేనికి అని ప్ర‌శ్నించారు పీవీ సునీల్ కుమార్. ఇంట్లో పిల్లలకి భోజన పెట్టలేని పేద తల్లిదండ్రులు చదువు ఎలా చెప్పిస్తారు? ఆ పిల్లల్ని పనిలో పెట్ట‌డం త‌ప్ప‌. చదువు లేకుండా ఆ పిల్లలు చాకిరీ చేస్తూ జీవితాల్ని ముగిస్తారు . కనీసం ఒక పూట భోజనం దొరుకుతుంది అంటే ఆ పిల్లలని బడికి పంపుతారని ఆ విష‌యం తెలుసు కోకుండా మాట్లాడం దారుణ‌మ‌న్నారు. త‌ప్ప‌కుండా గ‌రిక‌పాటి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *