తనను కలిసిన విప్ ఆది శ్రీనివాస్
కరీంనగర్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , విప్ ఆది శ్రీనివాస్. ఆయన గత కొంత కాలంగా పార్టీ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం పని చేస్తూ వచ్చిన తన పట్ల ఇంత అవమానకరంగా వ్యవహరించడం పట్ల ఆవేదన చెందారు. దీంతో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. తనను పార్టీలోనే ఉండాలని పలువురు నేతలు, మంత్రులు కోరారు. కానీ ససేమిరా అన్నారు. మంగళవారం టీపీసీసీ చీఫ్ , విప్ లు స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వచ్చారు. పార్టీ పరంగా మంచి పదవి వస్తుందని, వేచి చూడాలని, ఆవేశ పడవద్దని, పార్టీని వీడవద్దని కోరారు టీపీసీసీ చీఫ్.
పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 2023 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో చాలా ఇబ్బంది పడ్డానని, కార్యకర్తల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని జీవన్ రెడ్డి తెలిపాడు. రాజీనామా చేయడనే ఆశతో వెళ్తున్నామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు. ఇదిలా ఉండగా
మహేష్ కుమార్ గౌడ్ వెళ్లగానే బయటికి వచ్చిన జీవన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేపటి సమావేశం యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.





