జీవ‌న్ రెడ్డిని బుజ్జ‌గించిన టీపీసీసీ చీఫ్

త‌న‌ను క‌లిసిన విప్ ఆది శ్రీ‌నివాస్

క‌రీంన‌గ‌ర్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ , విప్ ఆది శ్రీ‌నివాస్. ఆయ‌న గ‌త కొంత కాలంగా పార్టీ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం ప‌ని చేస్తూ వ‌చ్చిన త‌న ప‌ట్ల ఇంత అవ‌మాన‌క‌రంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌ట్ల ఆవేద‌న చెందారు. దీంతో పార్టీ మారాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌ను పార్టీలోనే ఉండాల‌ని ప‌లువురు నేత‌లు, మంత్రులు కోరారు. కానీ స‌సేమిరా అన్నారు. మంగ‌ళ‌వారం టీపీసీసీ చీఫ్ , విప్ లు స్వ‌యంగా జీవ‌న్ రెడ్డి నివాసానికి వ‌చ్చారు. పార్టీ ప‌రంగా మంచి ప‌ద‌వి వ‌స్తుంద‌ని, వేచి చూడాల‌ని, ఆవేశ ప‌డ‌వ‌ద్ద‌ని, పార్టీని వీడ‌వ‌ద్ద‌ని కోరారు టీపీసీసీ చీఫ్‌.

పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్ప‌డింది. 2023 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో చాలా ఇబ్బంది పడ్డానని, కార్యకర్తల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని జీవన్ రెడ్డి తెలిపాడు. రాజీనామా చేయడనే ఆశతో వెళ్తున్నామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు. ఇదిలా ఉండ‌గా
మహేష్ కుమార్ గౌడ్ వెళ్లగానే బయటికి వచ్చిన జీవ‌న్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రేపటి సమావేశం యధావిధిగా కొనసాగుతుందని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *