స్మార్ట్ లాక్ డౌన్ విధించిన పాకిస్తాన్

ఆర్థిక సంక్షోభం, ఇంధ‌న కొర‌త కార‌ణం

పాకిస్తాన్ : పాకిస్తాన్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దేశ ప్ర‌జ‌ల‌కు ఆందోళ‌న క‌లిగించేలా నిర్ణ‌యం తీసుకుంది. ఈమేర‌కు ప‌శ్చిమాశియాలో చోటు చేసుకున్న యుద్దం కార‌ణంగా దేశ ప్ర‌ధాన‌మంత్రి జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత నేపథ్యంలో పాకిస్థాన్ లో ‘స్మార్ట్ లాక్‌డౌన్’ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా తలెత్తిన తీవ్ర ఆర్థిక సంక్షోభం, తీవ్ర ఇంధన కొరతతో దేశం సతమతమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు పీఎం న‌వాజ్ ష‌రీఫ్‌.
ఇంధన పొదుపు చర్యలలో భాగంగా, షాపింగ్ మాల్స్‌ను రాత్రి 8:00 గంటలలోపు, బేకరీలు, రెస్టారెంట్లు, ధాబాలు, ఫంక్షన్ హాళ్లను రాత్రి 10:00 గంటలలోపు మూసి వేయాలని ఆదేశించారు. ఈ రోజు నుంచి ఈ లాక్‌డౌన్ అమల్లోకి వస్తుందని తెలిపారు.

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఆంక్షలు పంజాబ్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, గిల్గిట్-బాల్టిస్తాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) అంతటా అమలు చేయబడతాయ‌ని స‌మాచారం.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *