ఏపీలో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు కొర‌త లేదు

స్ప‌ష్టం చేసిన మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

విజ‌య‌వాడ : వేస‌వి కాలంలో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర విద్యుత్, ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. బుధ‌వారం విజయవాడలో రూ.30 కోట్లతో నూతనంగా నిర్మించిన APCPDCL కార్పొరేట్ కార్యాలయం విద్యుత్ నిలయం భవనాన్ని ఎంపీ కేశినేని చిన్ని , స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, ముఖ్యమంత్రి ఎక్స్-అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ , సీఎండీ శ్రీ పుల్లారెడ్డి తో కలిసి ప్రారంభించారు. దీనిని ప్రార‌భించ‌డం సంతోషంగా ఉందన్నారు. నీటి కొర‌త‌కు ఇబ్బంది లేకుండా విద్యుత్ స‌ర‌ఫ‌రా రైతుల‌కు అందుతోంద‌ని తెలిపారు గొట్టి పాటి ర‌వికుమార్.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు రాష్ట్ర ప్రజలపై అదనంగా ఒక్క రూపాయి కరెంట్ ఛార్జీల భారం మోపకుండా, నిరంతరమైన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పని చేస్తున్నారని ప్ర‌శంస‌లు కురిపించారు ర‌వికుమార్. PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన , ‘PM కుసుమ్ యోజన’ వంటి కీలక పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కూడా వారు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *