రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం పెర‌గాలి

Spread the love

పిలుపునిచ్చిన ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా

ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు రాఘ‌వ్ చ‌ద్దా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల‌లో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం చాలా త‌క్కువ‌గా ఉంద‌ని పేర్కొన్నారు. మ‌రింత పెద్ద ఎత్తున భాగ‌స్వామ్యం క‌లిగి ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. FICCI FLO ఆధ్వర్యంలో YFLO ఢిల్లీలో రాజకీయాలు, నాయకత్వం , వ్యక్తిగత ప్రయాణాలపై ఒక ఆలోచనాత్మక సంభాషణలో పాల్గొన్నారు ఎంపీ రాఘవ్ చ‌ద్దా. ఈ చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దంగా జ‌రిగాయి. యువ‌త ఎక్కువ‌గా పాల్గొన్నారు. ప్ర‌తి ఒక్క‌రు సంధించిన ప్ర‌శ్న‌ల‌కు కూల్ గా స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా.

YFLO ఢిల్లీ అనేది విభిన్న వృత్తులు, వ్యవస్థాపక నేపథ్యాల నుండి వచ్చిన యువతులు నేర్చుకోవడానికి, నాయకత్వం వహించడానికి ,ఎదగడానికి ఒకచోట చేర్చే ఒక వేదిక కావ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు ఎంపీ. అన్నింటికన్నా ముఖ్యంగా, తమ సొంత మార్గాలను రూపొందించుకుంటున్న చైతన్య వంతమైన మహిళలతో నిండిన గదిలో సంభాషించడం స్ఫూర్తి దాయకంగా ఉందని పేర్కొన్నారు. దేశాన్ని మార్చే శ‌క్తి, స‌త్తా మ‌హిళ‌ల్లో ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు రాఘ‌వ్ చ‌ద్దా. రాజ‌కీయాలు క‌లుషిత‌మై పోయాయ‌ని కామెంట్స్ చేసేకంటే ముందు మ‌నం కూడా ఇందులో పార్టిసిపేట్ చేసేందుకు ఉత్సుక‌త చూపించాల‌న్నారు.

  • Related Posts

    పిల్ల‌ల‌ను సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంచాలి

    Spread the love

    Spread the loveఇందు కోసం చ‌ట్టం కూడా తీసుకు వ‌స్తున్నాం అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టెక్నాల‌జీ లో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని తెలిపారు. ఇదే క్ర‌మంలో ఇప్పుడు…

    రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అమ‌రావ‌తి : కాకినాడ, పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గాల‌లో అభివృద్ది కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేయాల‌ని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతున్న సేవలపై పర్యవేక్షణ పెంచాలని స్ప‌ష్టం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *