క్వాంటం వ్యాలీకి కేరాఫ్ గా అమ‌రావ‌తి : సీఎం

Spread the love

అమ‌రావ‌తిలో ఇవాళ ప్రారంభించిన చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : క్వాంటం వ్యాలీకి ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కాబోతోంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని నేడు అమరావతిలోముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ, మేధా టవర్స్‌లోని 1 క్యూ క్వాంటం ఫెసిలిటీ సీఎం ప్రారంభించిన వాటిలో ఉన్నాయి.

నేషనల్ క్వాంటం మిషన్, డీఎస్టీ సహా వేర్వేరు క్వాంటం కంపెనీల ప్రతినిధులు, ఐఐటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో సీఎం పాల్గొని ప్ర‌సంగించారు. ప్ర‌పంచంలో మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా మ‌నం కూడా మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. లేక‌పోతే వెనుక‌బ‌డి పోతామ‌ని పేర్కొన్నారు. ఏపీ లో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక పెద్ద ఎత్తున ఐటీ, లాజిస్టిక్ కంపెనీలు వ‌చ్చాయ‌ని తెలిపారు. ప్ర‌పంచ దిగ్గ‌జ సంస్థ గూగుల్ డేటా సెంట‌ర్ విశాఖ‌లో కొలువు తీరింద‌న్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో మ‌రికొన్ని ఏర్పాటు కాబోతున్నాయ‌ని వెల్ల‌డించారు.

  • Related Posts

    దేశానికి దిక్సూచి డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్

    Spread the love

    Spread the loveఘ‌నంగా నివాళులు అర్పించిన మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ సూర్య చంద్రులు ఉన్నంత వ‌ర‌కు నిలిచే ఉంటార‌ని అన్నారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. భార‌త దేశానికి దిక్సూచి…

    విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ సత్తా చాటాలి

    Spread the love

    Spread the loveరాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత అమ‌రావ‌తి : విద్యార్థులు విద్య‌తో పాటు క్రీడ‌ల్లో రాణించాల‌ని పిలుపునిచ్చారు మంత్రి స‌విత‌. త్వ‌ర‌లో రాష్ట్రంలో నూత‌నంగా మ‌రికొన్ని జ్యోతి బా పూలే స్కూళ్ల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఇందు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *