డీ లిమిటేష‌న్ వ‌ల్ల ఏపీకి తీర‌ని న‌ష్టం

Spread the love

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఆవేద‌న

అమ‌రావ‌తి : కేంద్ర స‌ర్కార్ తీసుకు వ‌స్తున్న డీ లిమిటేష‌న్ బిల్లు వ‌ల్ల ఏపీకి లాభం కంటే న‌ష్టం ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. సీఎం చంద్ర‌బాబు నాయుడుకు లేఖ రాశారు. దక్షిణ రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, దేశ ఆర్థిక వ్యవస్థకు పన్నుల ఆదాయానికి గణనీయమైన భాగస్వామ్యం కలిగి ఉన్నాయని అన్నారు. కానీ జనాభా ఆధారిత డీలిమిటేషన్ విధానం, జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలను శిక్షించే ప్రమాదకరమైన దిశగా మారుతుంద‌న్నారు. ఇది మంచి పాలనను నిరుత్సాహపరచే ప్రమాదకరమైన మునుపటి ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ తన స్వరం మాత్రమే కాదు, వేల కోట్ల రూపాయల భవిష్యత్ ఆర్థిక అవకాశాలను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు ష‌ర్మిలా రెడ్డి . ఈ నేపథ్యంలో నేను మిమ్మల్ని గట్టిగా, స్పష్టంగా కోరుతున్నానని పేర్కొన్నారు. దక్షిణ రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్రంగా అన్యాయం చేసే ఈ ప్రతిపాదిత డీలిమిటేషన్‌కు చంద్ర‌బాబు నాయుడు బహిరంగంగా, స్పష్టంగా వ్యతిరేకత తెలియ చేయాల‌న్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 లోక్‌సభ సభ్యులు, 11 రాజ్యసభ సభ్యులు అందరినీ, పార్టీ భేదాలు లేకుండా ఏకతాటిపైకి తీసుకువచ్చి, పార్లమెంటులో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసేలా ప్రోత్సహించాల‌ని కోరారు.

అత్యవసరంగా ఒకరోజు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఈ కీలక అంశంపై చర్చించి, ప్రతిపాదిత డీలిమిటేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను తిరస్కరించే తీర్మానం ఆమోదించి, కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా పంపించాలని కోరారు. ఇది రాజకీయ నిర్ణయం మాత్రమే కారాదు. ఇది ప్రజల హక్కులను కాపాడే రాజ్యాంగ బాధ్యతగా, భావితరాల భవితను గుర్తుపెట్టుకుని వేసే అడుగుగా భావించాల‌న్నారు.

  • Related Posts

    పేదల పొట్టగొట్టిన గత పాలకులు

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన సీఎం చంద్ర‌బాబుఅమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌త వైసీపీ పాల‌న పై మండిప‌డ్డారు. ప్ర‌త్యేకించి మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయ‌న నిర్వాకం…

    మత్స్యకారుల అభ్యున్నతికి క‌ట్టుబ‌డి ఉన్నాం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : మత్స్యకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. మత్స్యకారుల డిమాండ్ల మేరకు 2015-16లో 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని, దీనికి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *