రెండు రోజుల పాటు క్యాంపెయిన్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులో అన్నాడీఎంకే, ఎన్డీయే కూటమి తరపున బరిలో ఉన్న అభ్యర్థుల తరపున ప్రచారం చేయానున్నారు. ఈనెల 23వ తేదీన ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం డీఎంకే , ఇండియా కూటమి తో పాటు ఎన్డీయే, ప్రముఖ నటుడు స్థాపించిన టీవీకే పార్టీలు బరిలో ఉన్నాయి. తమిళనాడులో NDA చేపట్టిన ప్రజా సంబంధాల విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఎన్. చంద్రబాబు నాయుడు కోయంబత్తూరు, హోసూర్, చెన్నై, మదురై , సాత్తూరు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
పర్యటన షెడ్యూల్ ప్రకారం, మొదటి రోజు కోయంబత్తూరు, హోసూర్ , చెన్నై నగరాల్లో ఆయన పర్యటిస్తారు. ఇక రెండవ రోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా, నాయుడు మదురై , సాత్తూరు ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల కార్యకలాపాల నేపథ్యంలో, తమిళనాడులో NDA రాజకీయ సంబంధాలను బలోపేతం చేయడం, దాని ప్రజా సంబంధాల పరిధిని విస్తరించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం అని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది.






