చెత్తనే కాదు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తా

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌ట‌న

ప‌ల్నాడు జిల్లా : చెత్త‌నే కాదు చెత్త రాజ‌కీయాల‌ను శుభ్రం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కోసం పల్నాడుకు వచ్చాను. స్ఛచ్చాంధ్ర అంటే చెత్తను తొలగించి రాష్ట్రాన్ని పరిశుభ్రంగా చేయడం. గత ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రోడ్లపై వదిలేసి పోయింద‌న్నారు. చెత్త పైనా పన్ను వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నుతో పాటు వారు వదిలి వెళ్లిన చెత్తనూ తొలగించాం అన్నారు. రోడ్లపై చెత్తతో పాటు చెత్త రాజకీయాలను క్లోజ్ చేస్తాన‌ని చెప్పారు. ప్రజాగ్రహం ఎలా ఉంటుందో ఎన్నికల్లో చూశాం. 33 వేలకు పైగా మెజారిటీతో మాచర్ల చరిత్రలో లేని విధంగా జూలకంటి బ్రహ్మారెడ్డిని ప్రజలు గెలిపించారు. మాచర్ల పేరు వినగానే నాకు తోట చంద్రయ్య, జాలయ్య, నంబూరి శేషగిరిరావు లాంటి ప్రజాస్వామ్య వీరులు గుర్తొస్తారు. కత్తి మెడపై పెట్టినా కూడా జై చంద్రబాబు అంటూ చంద్రయ్య ప్రాణాలు వదిలాడు. జాలయ్యను అతి కిరాతంగా హతమార్చారు. ప్రజాస్వామ్యం కోసం నంబూరి శేషగిరిరావు పోరాడారు. వారందరికీ నిండు మనసుతో నివాళులు అర్పిస్తున్నాను అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

పల్నాడు జీవనాడి 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 1 లక్ష మందికి తాగునీరు అందించే వరికపుడిశెలను పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుడితే వాటిని పూర్తి చేసే అవకాశం భగవంతుడు నాకిచ్చాడు. వరికపుడిశెల మొదటి దశలో 1.54 టీఎంసీలు, రెండో దశలో 6.32 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. పోలవరం పనులు నేను 74 శాతం పూర్తిచేస్తే గత ఐదేళ్లలో జ‌గ‌న్ రెడ్డి వచ్చి దానిని ధ్వంసం చేశాడు. ప్రజా వేదికతో కూల్చివేత మొదలు పెట్టి పోలవరం డయా ఫ్రాంవాల్ కొట్టుకు పోయేలా చేశారు. మేం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికే పోలవరం పూర్తి అయ్యేదన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక పనులు వేగవవంతం అయ్యాయి. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం. రాష్ట్రంలోని జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. శ్రీకాకుళంలో ఉన్న వంశధారను, గోదావరి, కృష్ణా, రాయలసీమలో పెన్నా నదిని అనుసంధనం చేస్తామ‌న్నారు. ఇప్పటికే గోదావరి కృష్ణా నదిని అనుసంధానించాం. త్వరలోనే గోదావరి వంశధారను అనుసంధానం చేసి పెన్నాను కూడా కలుపుతాం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించే బాధ్యతను తాసు చూసుకుంటాన‌ని చెప్పారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *