రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

ఏర్పాట్లు చేశామ‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్

చెన్నై | త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడ్డగించిన మొత్తం రూ. 1262 కోట్లు కాగా, ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 543 కోట్లు అని తెలిపారు. ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించిన ప్రతిచోటా, అన్ని కేసులలోనూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయని చెప్పారు. మా నియంత్రణ కేంద్రాలకు అందుతున్న అన్ని ఫిర్యాదులపైనా తాము చర్యలు తీసుకుంటున్నాం అని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు.

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలు జరిగేలా చూడటానికే చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇందుకోసం 300 కంపెనీలను సిద్ధం చేశామన్నారు, వాటి నియామక ప్రక్రియ పూర్తయిందన్నారు. భారీ ఎత్తున బందోబ‌స్తు ఏర్పాటు చేశామ‌న్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు జరిగేలా తాము చూస్తామ‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *