రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

Spread the love

ఏర్పాట్లు చేశామ‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్

చెన్నై | త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడ్డగించిన మొత్తం రూ. 1262 కోట్లు కాగా, ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 543 కోట్లు అని తెలిపారు. ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించిన ప్రతిచోటా, అన్ని కేసులలోనూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయని చెప్పారు. మా నియంత్రణ కేంద్రాలకు అందుతున్న అన్ని ఫిర్యాదులపైనా తాము చర్యలు తీసుకుంటున్నాం అని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు.

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలు జరిగేలా చూడటానికే చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇందుకోసం 300 కంపెనీలను సిద్ధం చేశామన్నారు, వాటి నియామక ప్రక్రియ పూర్తయిందన్నారు. భారీ ఎత్తున బందోబ‌స్తు ఏర్పాటు చేశామ‌న్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు జరిగేలా తాము చూస్తామ‌న్నారు.

  • Related Posts

    ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం స‌బ‌బే

    Spread the love

    Spread the loveమ‌రాఠా మంత్రి గిరీష్ మ‌హాజ‌న్ కామెంట్స్ ముంబై : దేశ వ్యాప్తంగా సంచల‌నంగా మారారు మంత్రి మ‌రాఠాకు చెందిన గిరీష్ మ‌హాజ‌న్. వైరల్ అవుతున్న తన వీడియోపై బుధ‌వారం స్పందించారు. అది తప్పు అని నేను అనను అన్నారు.…

    పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం సీఎం స‌మీక్ష

    Spread the love

    Spread the loveకీల‌క సూచ‌న‌లు చేసిన చంద్ర‌బాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై బుధ‌వారం స‌చివాల‌యంలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వ‌హించారు. పాపులేషన్ మేనేజ్మెంట్‌పై చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చ‌ర్చించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *