బీజేపీ అధికార దుర్వినియోగం : శివ‌కుమార్

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన డిప్యూటీ సీఎం

బెంగ‌ళూరు : తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ సంద‌ర్బంగా స్పందించారు క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.
ఉత్తర భారతదేశంలోనూ, తమిళనాడుతో సహా దక్షిణాన కూడా బీజేపీ పక్షాన అధికార దుర్వినియోగం చేసింద‌ని మండిప‌డ్డారు. దీనిపై విచార‌ణ జ‌రిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌త్యేకించి పార‌ద‌ర్శ‌క‌త‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన ఎన్నిక‌ల సంఘం పూర్తిగా బీజేపీ గెలుపొందేలా ప్ర‌య‌త్నం చేసింద‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు డీకే శివ‌కుమార్ .

అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. అది విప‌రీత‌మైన‌ స్థాయిలో జరిగిందన్నారు డీకే శివ‌కుమార్. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించబడ్డారు..ఒక భారీ మార్పు స్పష్టంగా కనిపించింది. అయితే కేరళ విషయానికి వస్తే, అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి తీర్పును (mandate) ఇచ్చారు. తమిళనాడులో AIADMK ,బీజేపీ కూటమికి వారు మద్దతు ఇవ్వలేదు అని పేర్కొన్నారు డీకే శివ‌కుమార్. దక్షిణ భారతదేశంలో వచ్చిన ఫలితాల పట్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *