బీజేపీ మోసం అనైతిక విజ‌యం : దీదీ

Spread the love

ఎన్నిక‌ల సంఘంపై మాజీ సీఎం ఆగ్ర‌హం

కోల్ క‌తా : ప‌శ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌లు ముగిశాయి. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఊహించ‌ని విధంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్బంగా మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు ప్ర‌ధాని మోదీ, హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాల‌పై. బీజేపీ 100కి పైగా స్థానాలను దోచుకుందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్నికల సంఘం అనేది బీజేపీకి చెందిన సంఘం మాత్రమేనంటూ మండిప‌డ్డారు మ‌మ‌తా బెన‌ర్జీ. తాను ఎన్నికల అధికారికి (CO) , మనోజ్ అగర్వాల్‌కూ ఫిర్యాదు చేశానని చెప్పారు. కానీ వారు ఏమీ చేయలేక చేతులెత్తేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దీన్ని మీరు విజయం అని అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు మ‌మ‌తా బెన‌ర్జీ. ఇది అనైతిక విజయం తప్ప, నైతిక విజయం కానే కాద‌న్నారు. కేంద్ర బలగాలతోనూ, ప్రధానమంత్రి, హోంమంత్రితో నూ కలిసి ఎన్నికల సంఘం చేసినదంతా పూర్తిగా చట్ట విరుద్ధం అని ఆరోపించారు. ఇది దోపిడీ, దోపిడీ, కేవలం దోపిడీ మాత్రమే త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. తాము భ‌విష్య‌త్తులో క‌చ్చితంగా పుంజుకుని తీరుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

  • Related Posts

    దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా విశాఖ‌ప‌ట్నం

    Spread the love

    Spread the loveగెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం అమ‌రావ‌తి : కేంద్రం ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అమలులోకి వస్తుందని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.…

    ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌లు

    Spread the love

    Spread the loveకేర‌ళ‌లో యూడీఎఫ్ విజ‌యంపై శ‌శి థ‌రూర్ కేర‌ళ : తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. యూడీఎఫ్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. సుదీర్గ కాలం పాల‌న సాగించిన లెఫ్ట్ ఫ్రంట్ కు ప్ర‌జ‌లు మంగళం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *