టీవీకే చీఫ్ విజయ్ ని అభిమన్యుడిని చేశారు

Spread the love

పోసాని కృష్ణ ముర‌ళి సంచ‌ల‌న కామెంట్స్

హైద‌రాబాద్ : త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రింత ఉత్కంఠ‌ను రేపుతున్నాయి. ఎవ‌రు సీఎం అవుతార‌నే దానిపై ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ తీసుకునే నిర్ణ‌యంపై అంతా ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండ‌గా విజ‌య్ ని సీఎంగా చేసేందుకు బీజేపీ, కేంద్రం క‌లిసి నాట‌కాలు ఆడుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప్ర‌ముఖ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్రల‌కు తెర లేపారంటూ ఫైర్ అయ్యారు.

వర్నర్ ఆర్లేకర్ కూడా పక్షపాతంగా వ్యవహరించారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. గవర్నర్ పై ఒక్క విమర్శ కూడా చేయని విజయ్ గొప్పవాడు అని ప్ర‌శంసించారు. విజయ్ లాంటి గొప్ప వ్యక్తులు ప్రజలకు ఎంతో అవసరం అని అన్నారు పోసాని కృష్ణ‌ముర‌ళి. విజయ్ చుట్టూ ఎన్ని గొడవలు ఉన్నా సంయమనంతో ఉంటాడని అన్నారు. ఇక నా వ‌ర‌కు వ‌స్తే తాను ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌న్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేద‌న్నారు. నేను జెంటిల్మన్ ని కానీ డాబర్మన్ లా చూపిస్తున్నారని పేర్కొన్నారు. మంచి చేసే పార్టీకి మద్దతిచ్చానేగాని వైసీపీతో సహా ఏ పార్టీలోనూ చేరలేదన్నారు.

  • Related Posts

    సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్న విజ‌య్

    Spread the love

    Spread the loveత‌మిళ‌నాడు లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చెన్నై : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చినా ప్ర‌భుత్వం ఏర్పాటులో ఇంకా అనిశ్చితి కొన‌సాగుతూనే ఉంది. 243 స్థానాల‌కు గాను 108 సీట్లు సాధించింది ఒంట‌రిగా టీవీకే విజ‌య్. మ‌రో వైపు డీఎంకే,…

    హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పండి

    Spread the love

    Spread the loveకేంద్ర మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ తో సీఎం రేవంత్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర పట్టణాభివృద్ధి వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌ ను ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. మెట్రో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *