టీవీకేకు మ‌ద్ద‌తు హైక‌మాండ్ నిర్ణ‌యం

Spread the love

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్

పుదుచ్ఏచ‌రి : త‌మిళ‌నాడులో టీవీకే విజ‌య్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ప‌ట్ల స్పందించారు, ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు క‌ర్ణాట‌క రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. మా పార్టీ తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే, బీజేపీ శక్తులను అధికారం నుండి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు . మా ఏకైక లక్ష్యం అదే. అంతిమంగా, లౌకిక శక్తులు బలోపేతం కావాలని తాము కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.

పుదుచ్చేరి ఎన్నికల్లో పార్టీ పనితీరుపై ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో తాము రాజకీయ పరిస్థితులను చక్కదిద్దుతామని పేర్కొన్నారు. కొన్ని నిర్ణయాలు ఆలస్యంగా తీసుకున్నామని మాకు తెలుసు అని చెప్పారు డికే శివ‌కుమార్. కచ్చితంగా, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా,తాము పరిస్థితులను పునరుద్ధరించి, భవిష్యత్తులో సరైన రాజకీయ వ్యూహరచన చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు . ఇదిలా ఉండ‌గా తాజాగా త‌మిళ‌నాడులో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో టీవీకే పార్టీ 108 స్థానాల‌ను సాధించింది. కాంగ్రెస్ పార్టీ , వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐసీయుఎంఎల్ పార్టీలు మ‌ద్ద‌తు ఇచ్చాయి.

  • Related Posts

    తెలంగాణ‌లో రూ. 9,400 కోట్ల ప్రాజెక్టలకు శ్రీ‌కారం

    Spread the love

    Spread the loveజాతికి అంకితం ఇచ్చిన ప్ర‌ధాన‌మంత్రి మోదీ హైద‌రాబాద్ : తెలంగాణలో రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆదివారం మోదీ ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుల సమిష్టి లక్ష్యాలు అనుసంధానాన్ని బలోపేతం చేయడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగు పరచడం, భద్రతను పెంచడం…

    అమ్మకు ఎదురు లేదు తిరుగు లేదు

    Spread the love

    Spread the loveఇవాళ త‌ల్లుల దినోత్స‌వం సంద‌ర్బంగా అమ‌రావ‌తి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా అంత‌ర్జాతీయ త‌ల్లుల దినోత్స‌వం. ఈ సంద‌ర్బంగా స్పందించారు లోకేష్. కనిపించే ప్రతి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *