
రావాలని కోరిన సీఈవో సాయి గుండవెల్లి
హైదరాబాద్ : అమెరికాలో జరిగే ప్రతిష్టాత్మక తాల్ హెల్త్ఫెస్ట్ 2025కు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆ సంస్థ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆహ్వాన పత్రాన్ని స్వయంగా అందజేశారు సంస్థ సిఇఓ సాయి గుండవెల్లి. ఇదిలా ఉండగా వాస్తవానికి ఈనెల 24న బుధవారం న్యూయార్క్ వేదికగా జరిగే గ్రీన్ ఫీల్డ్ అవార్డు అందుకోవాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల హాజరు కాలేక పోయారు. ఈ విషయాన్ని మంగళవారం బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఇదిలా ఉండగా కేటీఆర్కు మరో అరుదైన గౌరవం దక్కడం విశేషం. తాల్ హాస్పిటల్స్ హెల్త్ఫెస్ట్ ను ఘనంగా నిర్వహిస్తున్నామని , ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు సీఈవో.
ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ సాయి గుండవెల్లి వెంట ఉన్నారు. ఈ కార్యక్రమం వచ్చే నెల అక్టోబర్ 24న కాలిఫోర్నియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో (UCSD)లో ఈ ‘హెల్త్ఫెస్ట్ 2025’ నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలు , మార్పు తీసుకొచ్చే వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భవిష్యత్ ఆరోగ్య సంరక్షణపై చర్చించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వ్యక్తిగత వైద్యం, డిజిటల్ హెల్త్కేర్ ఆవిష్కరణలు, సమీకృత వైద్య సంరక్షణ, ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలకు మార్గాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో కేటీఆర్ కీలకోపన్యాసం ఇవ్వనున్నారు.
తెలంగాణలో టెక్నాలజీ ఆధారిత పాలన, ఆవిష్కరణలతో కూడిన అభివృద్ధి, ఆరోగ్య రంగంలో తీసుకువచ్చిన విధానాలు ప్రపంచ ప్రజలకు ఎంతో విలువైనవిగా ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా ఈ ఆహ్వానాన్ని కేటీఆర్ అంగీకరించినందుకు టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలిపారు.