రాష్ట్ర విభ‌జ‌న వ‌ల్ల ఏపీకి తీర‌ని న‌ష్టం

మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్

తిరుప‌తి : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ఏపీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అర‌చేతిలో ప్ర‌జ‌ల‌కు స్వ‌ర్గం చూపిస్తున్నార‌ని ఆచ‌ర‌ణ‌లో అదంతా అబ‌ద్ద‌మ‌న్నారు. బుధ‌వారం చింతా మోహ‌న్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న వ‌ల్ల ఎంతో న‌ష్టం జ‌రిగింద‌న్నారు. దీనిని పూడ్చేందుకు ఎవ‌రూ ప్ర‌య‌త్నం చేయ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ప్ర‌ధానంగా రాష్ట్ర విభజన త‌ర్వాత తాము సంతోషంగా లేమ‌న్నారు చింతా మోహ‌న్. తూర్పు కి సముద్ర పడమట రాళ్ళు నేటికి సచివాలయాల‌నికి రాలేద‌న్నారు.

కేంద్రం ఏదీ లేద‌న్నారు. ప్ర‌స్తుతం సాయం కోసం ఆంద్రప్రదేశ్ కన్నీరు పెడుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ ముఖ్య‌మంత్రి. నారా చంద్ర‌బాబు నాయుడు నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తూ రాచ‌రిక పాల‌న సాగిస్తున్నాడ‌ని ఆరోపించారు. ఆయ‌న నిర్వాకం వ‌ల్ల ఏ ఒక్క వ‌ర్గం సంతోషంగా లేర‌న్నారు. అన్నీ అమ్మకానికి సిద్దంగా ఉంచార‌ని, అత్యవసరం గా ఎందుకు హైదరాబాద్ వదిలి వెళ్ళాల్సి వచ్చింద‌న్నారు. యూరియా కొర‌త కార‌ణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వాపోయారు. ప్ర‌ధాని మోదీ మోసం చేశార‌ని ఆరోపించారు. చేతకాని EVM లు ఓటు చోరి కి కారణం అని మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయింద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *