జ‌న‌సేన సంప‌త్ నాయ‌క్ పై జ‌ర్న‌లిస్టులు ఫైర్

నాగేశ్వ‌ర్ కు వ్య‌తిరేకంగా షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ : ప్రొఫెసర్ నాగేశ్వర్ పై.. ఆయనకు మద్దతుగా నిలిచిన జర్నలిస్టులను ఉద్దేశించి జనసేన తెలంగాణ నేత సంప‌త్ నాయ‌క్ తీవ్ర వ్యాఖ్య‌లపై మండిప‌డ్డారు జ‌ర్న‌లిస్టులు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నాగేశ్వర్ కు మద్దతుగా సమావేశం నిర్వహించారు. అదే ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన జనసేన నేతలు జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు.. బూతు పదాలతో రెచ్చి పోయారు. నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడారు.

దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు జనసేన నాయకుడు సంపత్ నాయక్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. అయితే తప్పుడు మాటలపై క్షమాపణ చెప్పకుండా ఆవేశంగా ఏదేదో మాట్లాడటానికి సంపత్ నాయక్ ప్రయత్నించడంతో మరింత ఆగ్రహానికి గురైన జర్నలిస్టులు అతన్ని క్షమాపణ చెబుతావా లేదా అని గట్టిగా నిలదీశారు. దీంతో సంపత్ నాయక్ సహా జనసేన నాయకులు మెల్లిగా అక్కడినుండి జారుకున్నారు. మంగ్లీ పై వచ్చిన ఆరోపణల విషయంలో బాధితుల తరపున గట్టిగా మాట్లాడిన సంపత్ నాయక్ ఇపుడు ఎందుకు సైలెంట్ అయ్యారంటూ మండిప‌డ్డారు జ‌ర్న‌లిస్టులు.

  • Related Posts

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో మంత్రి ఎస్. స‌విత బిజీ

    అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *