నాగేశ్వర్ కు వ్యతిరేకంగా షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ : ప్రొఫెసర్ నాగేశ్వర్ పై.. ఆయనకు మద్దతుగా నిలిచిన జర్నలిస్టులను ఉద్దేశించి జనసేన తెలంగాణ నేత సంపత్ నాయక్ తీవ్ర వ్యాఖ్యలపై మండిపడ్డారు జర్నలిస్టులు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నాగేశ్వర్ కు మద్దతుగా సమావేశం నిర్వహించారు. అదే ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన జనసేన నేతలు జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు.. బూతు పదాలతో రెచ్చి పోయారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడారు.
దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు జనసేన నాయకుడు సంపత్ నాయక్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. అయితే తప్పుడు మాటలపై క్షమాపణ చెప్పకుండా ఆవేశంగా ఏదేదో మాట్లాడటానికి సంపత్ నాయక్ ప్రయత్నించడంతో మరింత ఆగ్రహానికి గురైన జర్నలిస్టులు అతన్ని క్షమాపణ చెబుతావా లేదా అని గట్టిగా నిలదీశారు. దీంతో సంపత్ నాయక్ సహా జనసేన నాయకులు మెల్లిగా అక్కడినుండి జారుకున్నారు. మంగ్లీ పై వచ్చిన ఆరోపణల విషయంలో బాధితుల తరపున గట్టిగా మాట్లాడిన సంపత్ నాయక్ ఇపుడు ఎందుకు సైలెంట్ అయ్యారంటూ మండిపడ్డారు జర్నలిస్టులు.







