లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న లోకేష్

త‌మిళ‌నాడులో ప్ర‌సిద్ది చెందిన ఆల‌యం ఇది

షోలింగర్ : తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఈ ఉదయం షోలింగర్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోప్ వే మార్గంలో కొండపై ఉన్న ఆలయానికి చేరుకుని యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేసి శాలువాతో సత్కరించారు.

స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం యోగ నరసింహస్వామి ఆలయం సమీపంలోనే మరో కొండపై కొలువై ఉన్న శ్రీ యోగ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మంత్రి సందర్శించారు. కాలినడకన 420 మెట్లు ఎక్కి యోగ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరిగివస్తూ మార్గమధ్యలో భక్తులను మంత్రి లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్, డాక్టర్ కే.మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం

    తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్ర‌మ‌కోర్చి స్వామిని ద‌ర్శించుకునేందుకు పోటీ ప‌డుతుంటారు. గ‌త…

    16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

    తిరుపతి : తిరుప‌తి లోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలకు ముందుగా జూలై 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ విష‌యాన్ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *