క‌డ‌ప జిల్లాలో కుండ‌పోత వ‌ర్షం

ఎక్క‌డిక‌క్క‌డ విరిగి ప‌డిన చెట్లు

క‌డ‌ప జిల్లా : భారీ వ‌ర్షాలు, ఈదురు గాలుల దెబ్బ‌కు క‌డ‌ప జిల్లా వ‌ణికి పోయింది. ఎడ తెరిపి లేకుండా వ‌ర్షాలు కురియడంతో పెద్ద ఎత్తున పంట‌ల‌ను కోల్పోయారు రైతులు. దీంతో దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది స‌ర్కార్. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జిల్లా క‌లెక్ట‌ర్ కు ఫోన్ చేశారు. ప‌రిస్థితి పై ఆరా తీశారు. వివ‌రాలు తెలుసుకున్నారు. ఇదిలా ఉండ‌గా న‌ష్ట పోయిన రైతుల‌ను ఆదుకుంటామ‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు. కాగా క‌డ‌ప జిల్లాలోని జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు,మైదుకూరు ప్రాంతాల్లో భారీగా కురిసింది వ‌ర్షం.

గత రెండు రోజుల కిందట భారీ వర్షం కారణంగా జమ్మలమడుగు ప్రాంతంలో ఆగిపోయిన విద్యుత్ స‌ర‌ఫ‌రా. దీంతో ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డ్డారు. తాగు నీరు లేక పోవ‌డంతో ప‌ట్ట‌ణ వాసులు తాగేందుకు నీళ్లు అంద‌క నానా తంటాలు ప‌డ్డారు. ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నేటి వర్షం కారణంగా కొనసాగనున్న విద్యుత్ కొరత. తీర ప్రాంతాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. అత్యంత అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించారు.

  • Related Posts

    నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంక‌ట్రాం రెడ్డి

    హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన శాస‌న మండ‌లి స‌భ్యుడు (ఎమ్మెల్సీ) వెంక‌ట్రాం రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న కొడుకు భ‌ర‌త్ రాజ్ రెడ్డి గురించి అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఎలాంటి…

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

    న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *