బుర్రా విజ‌య‌శేఖ‌ర్ కు రామ‌కృష్ణ పుర‌స్కారం

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా గుర్తింపు పొందారు

హైద‌రాబాద్ : సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ శ్రీ జాగర్లమూడి రామకృష్ణ ప్రథమ వర్ధంతి సంతాప సభ నేడు నగరంలోని ఎస్.ఆర్.నగర్ లో జరిగింది. రామకృష్ణ పేరిట ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్ట్ బుర్రా విజయశేఖర్ కి అందజేశారు. ఈ సందర్భంగా జాగర్లమూడి రామకృష్ణ వార్తలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కె.నారాయణ మూర్తి, డాక్టర్ అంబటి సురేంద్ర రాజు, కొల్లి అరవింద్, వేణుగోపాల్, రాధాకృష్ణ, ఎం.సాగర్ కుమార్, బి.రాములు, ప్రముఖ సామాజిక నేత, అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపక కార్యదర్శి జ్ఞానేశ్వర్, డాక్టర్ నాగరాజ్, కె.ఎన్.ఆర్ మహర్షి, శ్రీ జాగర్లమూడి రామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు మరిశెట్టి మురళీ కుమార్ లతో పాటు అనేక మంది జర్నలిస్టులు పాల్గొని జాగర్లమూడి రామకృష్ణకు శ్రద్ధాంజలి ఘటించారు.

  • Related Posts

    నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంక‌ట్రాం రెడ్డి

    హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన శాస‌న మండ‌లి స‌భ్యుడు (ఎమ్మెల్సీ) వెంక‌ట్రాం రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న కొడుకు భ‌ర‌త్ రాజ్ రెడ్డి గురించి అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఎలాంటి…

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

    న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *