ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆట‌లు ఇక్క‌డ సాగ‌వు

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పొన్నం ప్ర‌భాక‌ర్

హైద‌రాబాద్ : మ‌రోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌కు చెందిన మేధావులు, ప్ర‌జాస్వామిక‌వాదులు, క‌ళాకారులు, క‌వులు, అమ‌రవీరుల కుటుంబాలు, జ‌ర్న‌లిస్టులు సైతం భ‌గ్గుమంటున్నారు. ఇటీవ‌ల మాజీ ఎమ్మెల్యే నాగేశ్వ‌ర్ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. ఈ త‌రుణంలో పోలీసులు కేసు నమోదు చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఈ సంద‌ర్బంగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ తాజాగా చేసిన కామెంట్స్ ప‌ట్ల మండిప‌డ్డారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్.

పవన్ కళ్యాణ్ బీజేపీతో ఒప్పందం కుదుర్చుకుని, ఇక్కడ తన నటనను ప్రారంభించారని ఆరోపించారు. ఒకవేళ ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి అయ్యుంటే, అక్కడ ఆయనకు నచ్చినట్లుగా వ్యవహరించ గలిగేవారని అన్నారు. కానీ తెలంగాణలో తాను ఏమైనా చేస్తానంటే, దాన్ని సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణపై విషం చిమ్మే పవన్ కళ్యాణ్, ‘నవ నిర్మాణ’ పేరిట ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్ర‌క‌టించారు.

  • Related Posts

    నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంక‌ట్రాం రెడ్డి

    హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన శాస‌న మండ‌లి స‌భ్యుడు (ఎమ్మెల్సీ) వెంక‌ట్రాం రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న కొడుకు భ‌ర‌త్ రాజ్ రెడ్డి గురించి అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఎలాంటి…

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

    న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *