స్పష్టం చేసిన కూటమి పార్టీ నేతల వార్నింగ్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కాన్స్టిట్యూషన్ క్లబ్లో ‘ఇండియా’ (INDIA) కూటమికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీపీ (CPP) చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే , ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ‘ఇండియా’ కూటమికి చెందిన సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ‘ఇండియా’ (INDIA) కూటమి వ్యూహరచనలో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ కీలక మీటింగ్ కు డీఎంకే పార్టీ నేతలు ఎవరూ పాల్గొనలేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ (TMC), డీఎంకే (DMK) వంటి ప్రాంతీయ పార్టీలు ఓటమి చవిచూసిన నేపథ్యంలో, బీజేపీని ఎదుర్కోవడానికి ఐక్యతను చాటడం , వ్యూహాన్ని పునః సమీక్షించు కోవడం కోసం ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని 23 రాజకీయ పార్టీలు ఇక్కడ సమావేశం కావడం ప్రాదాన్యత సంతరించుకుంది.
టీఎంసీకి చెందిన మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్, శివసేన (UBT) నేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు వామపక్ష , చిన్న పార్టీల నేతలు మధ్యాహ్నం 12 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరగనున్న ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ప్రతిపక్షాల సమావేశానికి ముందు రాహుల్ను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన పోస్టర్లను ఢిల్లీ IYC తొలగించింది. గత ఏడాది ఆగస్టులో రాహుల్ గాంధీ తన నివాసంలో ప్రతిపక్ష నేతలకు విందు ఇచ్చారు, దీనికి 25కు పైగా ప్రతిపక్ష పార్టీల నుండి దాదాపు 50 మంది నాయకులు హాజరయ్యారు. ఆ సమావేశంలో ఎన్నికల నిర్వహణలో అవకతవకల ఆరోపణలు, ముఖ్యంగా బీహార్లో ఓటర్ల జాబితాల ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) అంశం చర్చకు వచ్చింది.





