టీటీడీ అన్న‌ప్ర‌సాదానికి రూ. 2,500 కోట్లు

Spread the love


ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయ‌న్న టీటీడీ

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో నిత్యం అన్నదానం కొన‌సాగుతోంది. ప్ర‌తి రోజూ స్వామి వారిని 75 వేల నుంచి 80 వేల మందికి పైగా ద‌ర్శించుకుంటున్నారు. ఇందుకు గాను దాత‌ల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేక‌రిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా టీటీడీ ఈ ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి మే 31 వ‌ర‌కు రికార్డు స్థాయిలో భ‌క్తుల‌కు శ్రీ‌వారి అన్న ప్ర‌సాదాన్ని అందించింది. ఇది టీటీడీ ఆల‌య చ‌రిత్ర‌లోనే ఓ రికార్డ్ కావ‌డం విశేషం. అన్న ప్ర‌సాదం కోసం టీటీడీ ప్ర‌త్యేకంగా ట్ర‌స్ట్ ను ఏర్పాటు చేసింది.

భక్తుల విరాళాలతో నిర్వహించబడుతున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ వద్ద ప్రస్తుతం రూ.2,500 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ నిధుల ఆదాయంతో లక్షలాది మంది భక్తులకు నిత్యం ఉచితంగా నాణ్యమైన భోజనం అందిస్తూ టీటీడీ “అన్నదానం మహాదానం” అనే భారతీయ సనాతన సంప్రదాయాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తోంది. శ్రీవారి సన్నిధిలో ఆకలితో వచ్చే ప్రతి భక్తునికి తృప్తికరమైన భోజనం అందించడం ద్వారా టీటీడీ అన్నప్రసాద సేవలు ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి.

  • Related Posts

    అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న సీజే లీనా గిల్

    Spread the love

    Spread the loveశ్రీ కపిలేశ్వర స్వామిని దర్శించుకున్న సీజే తిరుపతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. ఘ‌న స్వాగ‌తం ప‌లికారు టీటీడీ చైర్మ‌న్ నాయుడుతో పాటు ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌, ఏఈవో చౌద‌రితో…

    వైద్య సేవ నిపుణుల వసతి సౌకర్యాలపై ఆరా

    Spread the love

    Spread the loveసకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని జేఈవో ఆదేశం తిరుపతి : శ్రీవారి భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రానున్న శ్రీవారి వైద్య సేవ నిపుణుల కోసం కేటాయించిన అతిథి గృహాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *