తెలంగాణ వివాదం జ‌న‌సేన ఢిల్లీ స‌మావేశం

Spread the love

తెలంగాణ‌వాదులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఫైర్

న్యూఢిల్లీ : ఇప్పుడు అంద‌రి క‌ళ్లు తెలంగాణ‌పై ప‌డ్డాయి. జ‌న‌సేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ మ‌ధ్య తెలంగాణ‌పై నోరు పారేసుకున్నారు. మీ అయ్య జాగీరా అని కామెంట్ చేయ‌డం క‌ల‌కలం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున తెలంగాణ‌వాదులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంకోసారి నోరు జారితే బ‌డిత పూజ చేస్తామ‌ని హెచ్చ‌రించారు. మ‌రో వైపు బీజేపీ క‌న్ను తెలంగాణ‌పై ముఖ్యంగా హైద‌రాబాద్ పై ప‌డింది. దాంతో పాటు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఆంధ్ర వ్యాపార‌వేత్త‌ల దృష్టి కూడా దీనిపై ఉంది. ఎలాగైనా దీనిపై పెత్త‌నం సాగించేందుకు కుట్ర‌ల‌కు తెర లేపారు. దీనికి వంత పాడుతున్నాడ‌ని తెలంగాణ వాదులు సీఎం రేవంత్ రెడ్డి పై మండిప‌డుతున్నారు.

ఈ త‌రుణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోరు జార‌డం, ఆపై ఉన్న‌ట్టుండి జ‌న‌సేన పార్టీ ముఖ్య స‌మావేశం ఇవాళ న్యూఢిల్లీలోని అశోక హోట‌ల్ లో నిర్వ‌హించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ మీటింగ్ పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. సేన ప్రస్థానం… జాతీయ సమగ్రత కోసం అనే విధానంపై నాయకులకు పార్టీ బాస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దిశా నిర్దేశం చేస్తార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజ‌ర‌య్యారు. జాతీయతకు కేంద్ర బిందువైన దేశ రాజధానిలో ఈ సమావేశం ఏర్పాటు కావ‌డం ప‌ట్ల ఆస‌క్తి రేపుతోంది.

  • Related Posts

    ఎంపీలు రాజ్యాంగ స్పూర్తిని విస్మ‌రించొద్దు

    Spread the love

    Spread the loveదిశా నిర్దేశం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల న్యూఢిల్లీ : జనసేన ఢిల్లీ వేదికగా ఎప్పుడు దేశ ప్రగతి, ఉన్నతి, పురోగతి కోసమే ఆలోచన చేస్తుందని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ . ఢిల్లీలో మంగ‌ళ‌వారం…

    షిప్ బిల్డింగ్ పరిశ్రమకు ఏపీ అనుకూలం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు సింగ‌పూర్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. తొలిరోజు పర్యటనలో ముందుగా సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *