డిప్యూటీ డైరెక్ట‌ర్ న‌ర‌హ‌రి లాక‌ర్ల‌లో నోట్ల క‌ట్ట‌లు

Spread the love

ఇటీవ‌లే రిమాండ్ కు త‌ర‌లించిన పోలీసులు

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో ఏసీబీ జూలు విదిల్చింది. భారీ ఎత్తున అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న వారంద‌రినీ ఒక్కరొక్క‌రుగా టార్గెట్ చేస్తూ దాడుల‌కు దగుతోంది. ఈ త‌రుణంలో తెలంగాణలో అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి రావు. ఆయ‌న‌కు సంబంధించి కిలోల కొద్ది బంగారు, వెండి ఆభ‌ర‌ణాల‌ను, ఫ్లాట్స్, ప్లాట్లు, భ‌వ‌నాలు, పొలాల‌కు సంబంధించి విలువైన ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. శ‌నివారం తాజాగా ఏసీబీ అధికారులు న‌ర‌హ‌రి రావుకు చెందిన ఆయా బ్యాంకుల‌లో లాకర్లను తెరిచారు.

దిమ్మ తిరిగేలా భారీ ఎత్తున నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట ప‌డ్డాయి. వాటిలో రూ.1.5 కోట్లను సీజ్ చేశారు. ఆ నోట్లకట్టలతో టేబుల్ నిండి పోయింది. ఇటీవల అతడి ఇళ్లలో సోదాలు చేసి భారీగా ఆస్తులు గుర్తించారు. హైదరాబాద్‌లో పలు బిల్డింగులతో పాటు బ్యాంకుల్లోని రూ.5 కోట్ల విలువైన FDలు, ఖాతాలో రూ.2.29 కోట్లు, 1.3 KGల బంగారం, 8 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకెన్ని చోట్ల నోట్ల‌ను దాచి ఉంచార‌నే దానిపై పెద్ద ఎత్తున చర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే జీహెచ్ఎంసీలో మ‌రో అవినీతి తిమిలింగాన్ని ప‌ట్టుకుంది ఏసీబీ.

  • Related Posts

    ఏక్ నాథ్ షిండేనే ఏకైక శివ‌సేన అధినేత

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన అమిత్ చంద్ర షా ముంబై : కేంద్ర మంత్రి, ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న శివ‌సేన పార్టీని చీల్చ‌డంలో కీల‌క…

    ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో యోగా భాగం కావాలి

    Spread the love

    Spread the loveప్ర‌ముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ అమ‌రావ‌తి : యోగా అన్న‌ది మ‌న జీవితంలో విడ‌దీయ‌లేని భాగం కావాల‌ని పిలుపునిచ్చారు బాబా రామ్ దేవ్. శ‌నివారం ఉండ‌వ‌ల్లిలో యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం చంద్ర‌బాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *