ఆధ్యాత్మిక వనాలను విరివిగా అభివృద్ధి చేయాలి

Spread the love

టీటీడీ అదనపు ఈవో వెంక‌య్య చౌద‌రి ఆదేశం

తిరుమల : తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇదిలా ఉండ‌గా టీటీడీ పెద్ద ఎత్తున వ‌నాల‌ను అభివృద్ది చేస్తోంది. ఇదిలా ఉండ‌గా తిరుమలలో ఆధ్యాత్మిక వనాలను, ఔషధ వనాలను ఆక‌స్మికంగా ప‌రిశీలించారు టీటీడీ అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి. వ‌నాల‌ను విరివిగా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

తిరుమలలో GNC, గీత పార్క్ , నామాల పార్క్ వంటి వివిధ ఉద్యానవనాలను పరిశీలించి టీటీడీ ఉద్యానవన, అటవీ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన రానున్న బ్రహ్మోత్సవాలకు తిరుమలలోని ఉద్యానవనాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న మొక్కలను పెంచేలా చర్యలు చేపట్టాలని చెప్పారు . టీటీడీ ఫారెస్ట్ విభాగం డిప్యూటీ సీఎఫ్ ఫణి కుమార్ నాయుడు, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    అయోధ్య విరాళాల కేసులో 150 మంది అనుమానితులు

    Spread the love

    Spread the love25 మందిపై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌న్న సిట్ ఉత్త‌ర ప్ర‌దేశ్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది అయోధ్య లోని రామ మందిరం నిర్మాణం. అప్ప‌ట్లో అద్వానీ సార‌థ్యంలో రామ మందిరం కోసం ర్యాలీ చేప‌ట్టారు దేశ…

    శ్రీ పద్మావతి స‌న్నిధిలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్

    Spread the love

    Spread the loveకుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్న శుక్లా తిరుప‌తి : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లా, కుటుంబ సభ్యుల తో కలిసి తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *