ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి

Spread the love

నియ‌మించిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం ఆదేశం

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ వై. శ్రీ‌లక్ష్మిని నియ‌మించింది. విచిత్రం ఏమిటంటే రెండేళ్ల తర్వాత పోస్టింగ్ జారీ చేసింది ప్ర‌భుత్వం. గురువారం ఇందుకు సంబంధించి కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఈ విష‌యాన్ని సీఎస్ ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఇక త‌న విష‌యానికి వ‌స్తే త‌న పూర్తి పేరు యెర్ర శ్రీలక్ష్మి. 1988 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వ్య‌క్తి.

మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్ లో ప‌ని చేశారు. కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు కేటాయించ బ‌డ్డారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో చేరారు. పరిశ్రమలు, గనులు, మున్సిపల్ పరిపాలన తదితర శాఖల్లో ఉన్నతాధికారిగా పనిచేశారు. 2011లో ఒబులాపురం మైనింగ్ కంపెనీ (OMC)కు సంబంధించిన అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ ఆమెను అరెస్టు చేసింది. గనుల లీజుల మంజూరులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆమెపై విచారణలు, న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగాయి.

2020లో ఆమె ఆంధ్రప్రదేశ్ కేడర్‌లోకి బదిలీ అయ్యారు. 2022లో ఒక దశలో ఆమెకు ఉపశమనం లభించినప్పటికీ, కేసుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు తరువాత కూడా కోర్టుల్లో కొనసాగాయి.

  • Related Posts

    ఎమ‌ర్జెన్సీ చారిత్ర‌క సంఘ‌ట‌న కాదు

    Spread the love

    Spread the loveఎంపీ సంజ‌య్ రౌత్ షాకింగ్ కామెంట్స్ ముంబై : శివ‌సేన ఎంబీటీ పార్టీ ఎంపీ, అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఎన్సీఆర్టీసీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఇంద‌లో భాగంగా 9వ త‌ర‌గ‌తి సాంఘిక…

    ఆర్డీఎస్ కు నీళ్లు అంద‌డం లేదు : సీఎం

    Spread the love

    Spread the loveపంచాయ‌తీలు వ‌ద్దు ప‌రిష్కార‌మే ముద్దు క‌ర్ణాట‌క : సీఎం ఎ . రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పంచాయితీ కావాలా సమస్య పరిష్కారం కావాలా అంటే ముందుగా నేను పరిష్కారమే కోరుకుంటాన‌ని అన్నారు. గురువారం కర్ణాటకలోని మునీరాబాద్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *