కేంద్ర మంత్రివ‌ర్గంలో భారీ మార్పులు..?

Spread the love

సంకేతాలు ఇచ్చిన ట్ర‌బుల్ షూట‌ర్ షా

న్యూఢిల్లీ : కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్డీయే ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన ప‌ద‌వులు మార్చే ఛాన్స్ లేక పోలేద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధానంగా బీజేపీకి చెందిన ట్ర‌బుల్ షూట‌ర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా , పీఎం మోదీతో పాటు ఎవ‌రిని నియ‌మించాలి, ఎవ‌రిని తీసి వేయాల‌ని నిర్ణ‌యించే ఆర్ఎస్ఎస్ బాస్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ సూచ‌న‌ల‌తో కొంద‌రి ప‌ద‌వుల నుంచి త‌ప్పించే ఛాన్స్ ఉన్న‌ట్లు టాక్. ఇదిలా ఉండ‌గా ఇందుకు ముహూర్తం కూడా ఖ‌రారు చేశార‌ని, వ‌చ్చే వారం భారీ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఉండ బోతోంద‌ని స‌మాచారం.

ఒక సీసీఎస్ మంత్రి మారవచ్చు. మాజీ సీఎం నితీష్ కుమార్ మంత్రివర్గంలో చేరవచ్చు. మాజీ ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మంత్రివర్గంలో చేరవచ్చని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు రికార్డు స్తాయిలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ హెచ్‌ఆర్‌డి శాఖకు మారవచ్చు. పలువురు మంత్రులను తొలగించడం లేదా పునర్వ్యవస్థీకరించడం జరగవచ్చు. వీరిలో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేర్ల‌లో శ్రీకాంత్ షిండే, అనురాగ్ ఠాకూర్, అరుణ్ గోవిల్, జనార్దన్ సింగ్ సిగ్రివాల్‌లను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. ఇటీవ‌లే ఆప్ కు గుడ్ బై చెప్పిన రాఘవ్ చద్దా లేదా అశోక్ మిట్టల్‌కు కూడా మంత్రి పదవి లభించవచ్చు. పంజాబ్ నుంచి రవనీత్ బిట్టు స్థానంలో తరుణ్ చుగ్‌ను నియమించవచ్చు.

  • Related Posts

    APAIMS 2.0 వ్యవస్థతో అక్ర‌మాల‌కు చెక్

    Spread the love

    Spread the loveఎరువుల పంపిణీపై ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఎరువు పంపిణీలో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉండేందుకు ఏపీ కూట‌మి స‌ర్కార్ ఏపీఏఐఎంఎస్ 2.0 వ్య‌వ‌స్థ‌ను తీసుకు వ‌చ్చింది. గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ ఎరువుల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలు,…

    చ‌రిత్ర సృష్టించిన సీఎం జోస‌ఫ్ విజ‌య్

    Spread the love

    Spread the loveఆరు కిలోమీట‌ర్ల మేర మార‌థాన్ లో ప‌రుగులు చెన్నై : టీవీకే పార్టీ చీఫ్ , త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ దేశ వ్యాప్తంగా సంచ‌లనంగా మారారు. ఆయ‌న శుక్ర‌వారం చెన్నైలో డ్ర‌గ్స్, మాద‌క ద్ర‌వ్యాలకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *