వెంక‌ట నారాయ‌ణ నియామ‌కంపై బీజేపీ ఫైర్

Spread the love

ఇది పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌ని ఆగ్ర‌హం

చెన్నై : తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా (న్యూఢిల్లీలో) వెంకట నారాయణ కె. నియామకాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఖండించారు. ఇది తమిళులకు అన్యాయం చేసే చర్య అని ఆయన పేర్కొన్నారు. శ‌నివారం త‌ను మీడియాతో మాట్లాడారు. బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్, ‘కెవిఎన్ ప్రొడక్షన్స్’ (KVN Productions) వ్యవస్థాపకుడైన వెంకట నారాయణ, రాజకీయాల్లోకి రాకముందు సి. జోసెఫ్ విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ను నిర్మించారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. సాయి కుమార్ ఈ నియామక ఉత్తర్వులను జారీ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది పూర్తిగా చ‌ట్టానికి విరుద్దంగా జ‌రిగింద‌ని పేర్కొన్నారు. తక్ష‌ణ‌మే వెంక‌ట నారాయ‌ణ నియామ‌కాన్ని ర‌ద్దు చేయాల‌ని వైనార్ నాగేంద్రన్ డిమాండ్ చేశారు. త‌మిళనాడుకు చెందిన వారు అనుభ‌వం క‌లిగిన ఆఫీస‌ర్లు లేరా అని ప్ర‌శ్నించారు బీజేపీ అధ్య‌క్షుడు . ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల అస్తిత్వానికి భంగం క‌లిగించేలా సీఎం జోసెఫ్ విజ‌య్ నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ఆవేద‌న చెందారు.

  • Related Posts

    విశ్వ‌క‌ర్మ‌ల‌ను ఒక్క‌టిగా గుర్తించాలి

    Spread the love

    Spread the loveఅడ్లూరి ర‌వీంద్రాచారి డిమాండ్ హైద‌రాబాద్ : విశ్వ బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌ల‌పై శ‌నివారం సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్‌లో రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. విశ్వ‌క‌ర్మ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఉదయం 11 నుండి 2 గంటల వరకు నిర్వ‌హించిన‌ ఈ స‌మావేశంలో…

    స్త్రీ శ‌క్తి ప‌థ‌కం సాధికార‌త‌కు ద‌ర్ప‌ణం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి ఎస్. స‌విత శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక అభివృద్ది ప‌రుగులు పెడుతోంద‌ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *