బోన‌స్ పేరుతో బోగ‌స్ : హ‌రీశ్ రావు

Spread the love

సింగ‌రేణి కార్మికుల‌కు స‌ర్కార్ శాపం

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు కాంగ్రెస్ స‌ర్కార్ పై దుమ్మెత్తి పోశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న‌పై మండిప‌డ్డారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సింగరేణి కార్మికుల బోనస్ పేరుతో బోగస్ చేసిందంటూ రేవంత్ ప్రభుత్వంపై మండిప‌డ్డారు. కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50 శాతానికి పైగా కోత విధించారని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. సంస్థ ప‌రంగా సింగ‌రేణి మొత్తం రూ. 6394 కోట్ల లాభాలు గడించింద‌ని కానీ కేవలం రూ.2360 కోట్లలో 34 శాతం ఇవ్వడం ఏమిటని నిలదీశారు స‌ర్కార్ ను. దసరా పండుగ పూట కార్మికులకు చేదు కబురు చెప్పారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌పై ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రంలో అయినా, ఇప్పుడైనా సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ చేసింది ద్రోహమే అని వ్యాఖ్యానించారు.

నమ్మి ఓటేసినందుకు సింగరేణి కార్మికులను నయ వంచన చేసిందని అన్నారు హ‌రీశ్ రావు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్ద‌పీట వేశామ‌ని, కానీ కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చాక నిట్ట నిలువునా మోసం చేసింద‌న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైందని చెప్పారు హ‌రీశ్ రావు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పి, తీవ్ర నిరాశకు నెట్టి వేశారంటూ వాపోయారు. మొత్తం లాభంలో కొంత మొత్త‌మే బోన‌స‌గా ప్ర‌క‌టించ‌డం దారుణ‌మ‌న్నారు. పంచాల్సిన వాటాను తగ్గించి, శాతాలు పెంచి సింగరేణి కార్మికులను మోసం చేశారని ఫైర్ అయ్యారు.గతేడాది కూడా ఇదేవిధంగా మోసం చేసి, బోనస్‌లో 50 శాతం వాటా కోత విధించారని అన్నారు. గతంలో కేసీఆర్‌ సర్కార్ ఎప్పుడైనా నికర లాభంలో కార్మికులకు వాటా ఇచ్చారని చెప్పారు.

  • Related Posts

    ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం స‌బ‌బే

    Spread the love

    Spread the loveమ‌రాఠా మంత్రి గిరీష్ మ‌హాజ‌న్ కామెంట్స్ ముంబై : దేశ వ్యాప్తంగా సంచల‌నంగా మారారు మంత్రి మ‌రాఠాకు చెందిన గిరీష్ మ‌హాజ‌న్. వైరల్ అవుతున్న తన వీడియోపై బుధ‌వారం స్పందించారు. అది తప్పు అని నేను అనను అన్నారు.…

    రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

    Spread the love

    Spread the loveఏర్పాట్లు చేశామ‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్ చెన్నై | త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడ్డగించిన మొత్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *