విజ‌య‌వాడ ఉత్స‌వం ఏపీకి గ‌ర్వ‌కార‌ణం

ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు

అమరావతి : విజయవాడ ఉత్సవ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న ఈ మహోత్సవం ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ కార్నివల్‌గా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

స్పీకర్ కార్యాలయంలో సోమ‌వారం శాసన సభ్యులు బోండా ఉమా , గద్దే రామ్మోహన్ , బోడె ప్రసాద్ మర్యాద పూర్వకంగా స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడును కలిశారు. విజయవాడ ఉత్సవానికి రావాల్సిందిగా ప్ర‌త్యేకంగా ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఎంజీ రోడ్, ఘంటసాల సంగీత కళాశాల, విజయవాడ ఎక్స్పో వేదికలపై జరిగే ఈ ఉత్సవం విజయవాడ సాంస్కృతిక గౌరవాన్ని మరింతగా పెంచుతుందని ఆశా భావం వ్య‌క్తం చేశారు.

ఇంద్ర‌కీలాద్రి కొండ‌పై కొలువు తీరిన శ్రీ‌క‌న‌క దుర్గ‌మ్మ అమ్మ రి దసరా శోభాయాత్రల నడుమ జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా ఒక్క నగరం – ఒకే ఉత్సవం అనే భావనతో నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు అయ‌య‌న్న‌పాత్రుడు. . యువ సోంలో రాష్ట్ర ప్రజలందరూ పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. దేవి కనకదుర్గ అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అయ్య‌న్న పాత్రుడు ఆకాంక్షించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *