
ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ)
సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) కీలక ప్రకటన చేసింది. భారత జట్టుతో వన్డే సీరీస్, టి20 సీరీస్ ల ఆడేందుకు గాను ఆసిస్ టీమ్ ను వేర్వేరు గా ఖరారు చేసింది. గాయపడిన కెప్టెన్ పాట్ కమ్మిన్స్ దూరం కానున్నాడు. అక్టోబర్ 19 నుండి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల కోసం కీలక మార్పులు చోటు చేసింది బబోర్డు. పేసర్ మిచెల్ స్టార్క్, ఓపెనర్ మాట్ షార్ట్లు జట్టులోకి వచ్చారు. వచ్చే ఏడాది ఐసిసి టి20 ప్రపంచ కప్కు కౌంట్డౌన్ కొనసాగుతున్నందున గత నెలలో తన టి20ఐ రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్క్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి వచ్చారు. వీరు ప్రస్తుతం యువ క్రికెటర్ గిల్ సారథ్యంలో ఆడనున్నారు. గాయపడిన కమ్మిన్స్ స్థానంలో స్టార్క్ ను నియమించింది ఆసియా క్రికెట్ బోర్డు.
ఇక టి20 ఫార్మాట్ కు కెప్టెన్ మిచ్ మార్ష్ మరోసారి భారత్తో జరిగే వన్డే, టి20 జట్లకు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఇక జట్ల పరంగా చూస్తే ఇలా ఉన్నాయి. ఆస్ట్రేలియా వన్డే జట్టుకు మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా ఆడతారు.
టి20 జట్టు కేవలం రెండు మ్యాచ్ లకు మాత్రమే ప్రకటించింది ఏసీబీ. మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా ఉన్నారు.