ఐసీసీ అవార్డు రేసులో భార‌త క్రికెట‌ర్లు

Spread the love

అభిషేక్ శ‌ర్మ‌, స్మ‌తి మంద‌న్నా, కుల్దీప్

హైద‌రాబాద్ : ఇంట‌ర్నేన‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ముగ్గురు భార‌తీయ క్రికెట‌ర్లు రేసులో నిలిచారు. అభిషేక్ శ‌ర్మ‌, కుల్దీప్ యాద‌వ్, స్మృతీ మంద‌న్నా ఉన్నారు. పురుషుల విభాగంలో ఇద్ద‌రు, మహిళా విభాగంలో ఒక‌రు ఉన్నారు. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 టోర్నీ ఛాంపియ‌న్ గా నిలిచింది భార‌త జ‌ట్టు. ఈ టోర్నీలో ప‌రుగులు చేయ‌డంలో టాప్ గా నిలిచాడు అభిషేక్ శ‌ర్మ‌. త‌ను 7 మ్యాచ్ లు ఆడి 314 ర‌న్స్ చేశాడు. ఇక బౌలింగ్ ప‌రంగా టాప్ లో నిలిచాడు 7 మ్యాచ్ లు ఆడి 17 వికెట్లు తీసి నెంబ‌ర్ వ‌న్ గా నిలిచాడు కుల్దీప్ యాద‌వ్. మ‌రో వైపు పాకిస్తాన్ ఓపెన‌ర్ సిద్రా అమీన్ , ద‌క్షిణాఫ్రికాకు చెందిన టాజ్మిన్ బ్రిట్స్ కూడా ఈ అవార్డు రేసులో ఉన్నారు.

ఆసియా క‌ప్ లో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపిక‌య్యాడు యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ‌. ఇందులో 200 స్ట్రైక్ రేట్‌తో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్మృతి మంధాన తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ ఈ హై-స్టేక్స్ టోర్నమెంట్‌లో కలల పరుగును ఆస్వాదించాడు, ఇక్కడ భారతదేశం చిరకాల శత్రువులైన పాకిస్తాన్‌ను మూడుసార్లు ఓడించింది, 6.27 ఎకానమీ రేటుతో 17 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు స్పిన్న‌ర్. ఫైన‌ల్ లో పాకిస్తాన్ కు చుక్క‌లు చూపించాడు. కేవ‌లం 30 ర‌న్స్ మాత్ర‌మే ఇచ్చి నాలుగు కీల‌క వికెట్లు తీశాడు. ఇక‌ స్టార్ ఇండియా టాప్-ఆర్డర్ బ్యాటర్ మంధాన, గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకుంది. మహిళల విభాగంలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’కి నామినేట్ చేయబడింది.

  • Related Posts

    త‌ట‌స్థ ప్ర‌దేశాల‌లోనే మ్యాచ్ లు ఆడుతాం

    Spread the love

    Spread the loveఐసీసీకి స్ప‌ష్టం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా తాము ఇండియాలో జ‌రిగే కీల‌క మ్యాచ్ ల‌ను…

    ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 బ‌రువు 6,175 కిలోలు

    Spread the love

    Spread the love18 క్యారెట్ బంగారంతో ట్రోఫీ త‌యారీ న్యూఢిల్లీ : అమెరికా వేదిక‌గా ఈ ఏడాది ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే మిలియ‌న్ల కొద్దీ టికెట్లు అమ్ముడు పోయాయి. ఈసారి ట్రోఫీని కోకో కోలా స్పాన్స‌ర్ చేస్తోంది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *