జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు పేద‌ల‌కు వ‌రాలు

బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌

స‌త్య‌సాయి జిల్లా : కేంద్రం తీసుకు వ‌చ్చిన జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల పేద‌లు, మ‌ధ్య త‌ర‌గతి వ‌ర్గాల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో జీఎస్టీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి పాల్గొని ప్ర‌సంగించారు. దీర్ఘకాలిక వ్యాధులకు వినియోగించే ఔషధాలు జీఎస్టీ నుండి మినహాయించారన్నారు. వీటిని ప్రజలకు తెలియజేసి, జీఎస్టీ లబ్దిని ప్రతీ కుటుంబం సద్వినియోగం చేసుకునేలా నెల రోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి వారం ఇంటింటికీ వెళ్లి జీఎస్టీ తగ్గింపు కారణంగా ఏ వస్తువులు ఏ మేరకు తగ్గాయి, ప్రతీ కుటుంబానికి నెలకు ఎంత మేరకు ఆదా అవుతుందనే విషయాన్నీ తెలియజేయడం జరిగిందన్నారు.

రెండవ వారం వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి వినియోగించే వస్తువులపై రైతులకు అవగాహన కలిగిస్తున్నామని, మూడవ వారం మానవ వనరుల అభివృద్ధి, విద్య, టూరిజం తదితర వాటికి సంబంధించి అవగాహన కలిగించడం జరుగుతుందని చెప్పారు. నాల్గవ వారం ద్విచక్ర వాహనాలు, కారులు, భారీ వాహనాలపై జీఎస్టీ తగ్గుదల అంశాలపై ప్రజలకు తెలియజేయడం చేస్తున్నారు. ప్రజలు వస్తువులను కొనుగోలు చేసే సమయంలో గతంలో ధరలు, జీఎస్టీ తగ్గిన తరవాత ధరలు గురించి వ్యాపారులను అడిగి తెలుసు కోవాలన్నారు. ప్రతీ కొనుగోలుకు తప్పనిసరిగా బిల్లులు పొందాలని కలెక్టర్ సూచించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *