యాద‌గిరిగుట్ట‌ను ద‌ర్శించుకున్న చీఫ్ జ‌స్టిస్

Spread the love

జ‌స్టిస్ అప‌రేష్ కుమార్ కు ఘ‌న స్వాగతం

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శ‌నివారం యాద‌గిరిగుట్ట‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం పూజారులు , ఆల‌య క‌మిటీ చైర్మ‌న్, స‌భ్యులు, ఈవో ఆధ్వ‌ర్యంలో లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు . ఆయనతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. శరత్, జస్టిస్ కె. సుజన, జస్టిస్ వి. రామకృష్ణా రెడ్డి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.

దర్శన ఏర్పాట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి జి. రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదం, స్మారక ఫోటోలను న్యాయ మూర్తుల‌కు అందజేశారు. స్వామి వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం సీజే అప‌రేష్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడారు. యాద‌గిరి గుట్ట పుణ్య క్షేత్రాన్ని ద‌ర్శించు కోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. స్వామి వారి కృప ప్ర‌తి ఒక్క‌రి పై ఉండాల‌ని తాను కోరుకున్నాన‌ని తెలిపారు. ఆయ‌న‌తో పాటు వ‌చ్చిన న్యాయ‌మూర్తులు సైతం ఈ ఆల‌యాన్ని అద్భుతంగా నిర్మించారంటూ కితాబు ఇచ్చారు. సాక్షాత్తు ఆ ల‌క్ష్మీ న‌రసింహుడు కొలువు తీరి ఉండ‌డం మ‌హ‌త్ భాగ్య‌మ‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం మంత్రి దుర్గేష్ పూజ‌లు

    Spread the love

    Spread the loveఆయ‌న ఆరోగ్య ప‌రంగా త్వ‌ర‌గా కోలుకోవాలి అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల ఈ మ‌ధ్య‌న తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు. నీర‌సంగా అనిపించ‌డంతో ఆస్ప‌త్రికి వెళ్లారు. అక్క‌డ త‌క్ష‌ణ‌మే త‌న‌కు శ‌స్త్ర చికిత్స…

    శ్రీవారి సేవ చేయడం పూర్వ జ‌న్మ సుకృతం

    Spread the love

    Spread the loveతిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం ఈవో ర‌విచంద్ర‌ తిరుపతి : తిరుమల శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టమని టిటిడి ఈవో ఎం. రవిచంద్ర అన్నారు. తిరుపతి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జాతీయ పౌర దినోత్సవాన్ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *