న‌గేష్ మృతిపై జాతీయ ఎస్టీ క‌మిష‌న్ సీరియ‌స్

బానోతు అనుమానాస్ప‌ద మృతి పై ఆగ్ర‌హం

హైద‌రాబాద్ : జాతీయ ఎస్టీ (షెడ్యూల్డ్ కులాల‌) క‌మిష‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. హైద‌రాబాద్ లోని
మియాపూర్ ప్రైవేట్ హాస్టల్‌లో బానోత్ న‌గేష్ అనే విద్యార్థి అనుమానాస్ప‌ద మృతిపై విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ సంద‌ర్బంగా మండిప‌డింది. ఢిల్లీ విశ్వ విద్యాలయానికి చెందిన న్యాయ శాస్త్ర విద్యార్థి సభావ‌ట్ క‌ళ్యాణి ఎస్టీ క‌మిష‌న్ కు విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు తీవ్రంగా స్పందించింది ఎస్టీ క‌మిష‌న్. అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించిన బానోతు న‌గేష్ స్వ‌స్థ‌లం ఖ‌మ్మం జిల‌ల్లా యోనెకుంట తాండా.

ఈ కేసు విచార‌ణ‌కు సంబంధించి త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని ఆదేశించింది సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ ను. ఇందులో భాగంగా అక్టోబ‌ర్ 7వ తేదీన నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఘ‌ట‌న‌పై సీరియ‌స్ అయ్యింది. బానోతు న‌గేష్ మృతిపై 15 రోజుల లోపు కేసు పురోగ‌తి, చ‌ర్య‌ల వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది ఎస్టీ క‌మిష‌న్. ఒకవేళ నిర్దేశించిన స‌మ‌యం లోపు స‌మాధానం ఇవ్వ‌క పోతే , సివిల్ కోర్టు అధికారుల‌తో స‌మ‌న్లు జారీ చేయాల్సి ఉంటుంద‌ని సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ ను హెచ్చ‌రించింది జాతీయ ఎస్టీ క‌మిష‌న్.

Related Posts

రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *