న‌గేష్ మృతిపై జాతీయ ఎస్టీ క‌మిష‌న్ సీరియ‌స్

Spread the love

బానోతు అనుమానాస్ప‌ద మృతి పై ఆగ్ర‌హం

హైద‌రాబాద్ : జాతీయ ఎస్టీ (షెడ్యూల్డ్ కులాల‌) క‌మిష‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. హైద‌రాబాద్ లోని
మియాపూర్ ప్రైవేట్ హాస్టల్‌లో బానోత్ న‌గేష్ అనే విద్యార్థి అనుమానాస్ప‌ద మృతిపై విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ సంద‌ర్బంగా మండిప‌డింది. ఢిల్లీ విశ్వ విద్యాలయానికి చెందిన న్యాయ శాస్త్ర విద్యార్థి సభావ‌ట్ క‌ళ్యాణి ఎస్టీ క‌మిష‌న్ కు విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు తీవ్రంగా స్పందించింది ఎస్టీ క‌మిష‌న్. అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించిన బానోతు న‌గేష్ స్వ‌స్థ‌లం ఖ‌మ్మం జిల‌ల్లా యోనెకుంట తాండా.

ఈ కేసు విచార‌ణ‌కు సంబంధించి త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని ఆదేశించింది సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ ను. ఇందులో భాగంగా అక్టోబ‌ర్ 7వ తేదీన నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఘ‌ట‌న‌పై సీరియ‌స్ అయ్యింది. బానోతు న‌గేష్ మృతిపై 15 రోజుల లోపు కేసు పురోగ‌తి, చ‌ర్య‌ల వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది ఎస్టీ క‌మిష‌న్. ఒకవేళ నిర్దేశించిన స‌మ‌యం లోపు స‌మాధానం ఇవ్వ‌క పోతే , సివిల్ కోర్టు అధికారుల‌తో స‌మ‌న్లు జారీ చేయాల్సి ఉంటుంద‌ని సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ ను హెచ్చ‌రించింది జాతీయ ఎస్టీ క‌మిష‌న్.

Related Posts

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

Spread the love

Spread the loveకోయంబత్తూరు, హోసూరు, తళ్లి, అవడి, మధురైలలో త‌మిళ‌నాడు : ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడుకు బ‌య‌లుదేరి వెళ్లారు. ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, హోసూరు,…

బీజేపీపై భ‌గ్గుమ‌న్న క‌డియం శ్రీ‌హ‌రి

Spread the love

Spread the loveతెలంగాణ‌పై అడుగ‌డుగునా అవమానం హైద‌రాబాద్ : స్టేష‌న్ ఘ‌న‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బార‌తీయ జ‌న‌తా పార్టీని ఏకి పారేశారు. ఆ పార్టీ నేత‌లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావ‌డం లేద‌న్నారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *